Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీలో తొక్కిసలాట.. ఇద్దరి మృతి

Webdunia
శనివారం, 18 జులై 2015 (19:43 IST)
జగన్నాథస్వామి రథయాత్ర సందర్భంగా పూరీలో శనివారం భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. భక్త జనం అధికం కావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కటక్‌ తరలించారు.
 
ఈ సహస్రాబ్దికే తొలి నవకళేబర యాత్ర ఒడిశాలోని పూరిలో అత్యంత వైభవంగా కొనసాగుతోంది. కట్టుదిట్టమైన భద్రత, లక్షలాది భక్తుల నడుమ జగన్నాథుడు బలభద్ర, సుభద్ర సమేతుడై రథాలపై వూరేగుతున్నారు. పురుషోత్తముని నామస్మరణతో పూరి పరిసరాలు మార్మోగుతున్నాయి. అత్యంత విశిష్టతను సంతరించుకున్న నవకళేబర యాత్రతో జగన్నాథస్వామి, బలభద్ర స్వామి, సుభద్ర అమ్మవారు నూతన దేహంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. 
 
పూరీక్షేత్ర తొక్కిసలాట మృతులకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.
 
 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments