Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ, రాజమండ్రిలలో శ్రీవారి ఆలయాలు

Webdunia
బుధవారం, 29 జులై 2015 (07:46 IST)
తిరుమల వేంకటేశ్వరస్వామిని భక్తులకు మరింత దగ్గర చేయడానికి విజయవాడ, రాజమండ్రిలలో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. తెలంగాణలోని భద్రాచలం క్షేత్రంలాగానే కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. మంగళవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 
 
రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఈ ఆలయాలను నిర్మిస్తున్నట్లు ఆయన వివరించారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో మహామణి మండప నిర్మాణానికి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. టీటీడీలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం తిరుమలలో పెట్రోల్ బంకు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు చదలవాడ వివరించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments