పరకామణి సేవకుల సంఖ్య పెంపు

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (11:56 IST)
శ్రీవారి ఆలయంలో హుండీ లెక్కింపును మరింత వేగవంతం చేయడానికి పరకామణిలో తిరుమల తిరుపతి దేవస్థానం సేవకుల సంఖ్యను పెంచుతోంది. అదనంగా 130 మందిని తీసుకుంటున్నారు. మరింత వేగంగా పెంచడం వలన మెరుగైన సేవలు అందించవచ్చునని తిరుమల తిరుపతి దేవస్థానం అభిప్రాయపడుతోంది. పెరిగిన పరకామణి సేవకుల సేవలు రేపటి నుండి అమలులోనికి రానుంది. 
 
ప్రస్తుతం ఒక బ్యాచ్‌కి 120 మందికి అవకాశం కల్పిస్తున్న  పరకామణి సేవకుల సంఖ్యను 250 మందికి అవకాశం కల్పించనుంది. అదే విధంగా మూడు షిప్టులో విధానాలు ఉంటాయి.  'ఏ' షిప్టులో 100మంది సేవకులు 'బి' షిప్టులో 100 సేవకులు 'సి'  షిప్టులో 50 సేవకులు సేవచేసే అవకాశం ఉంటుంది. అందులో 'ఏ' షిప్టు ఉదయం 7 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 1 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సేవ చేయాల్సి ఉంటుంది.
 
బి షిప్టు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 6 వరకు సేవ చేయాల్సి ఉంటుంది. సి షిప్టు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు సేవ చేయాల్సి ఉంటుంది. పరకామణి సేవకులు సేవ చేయాల్సిన తేది మరియు షిప్టు ఆన్‌లైన్‌ లోనే రిజిస్టరు చేసుకొని తదనుగుణంగా సేవకు రావలసి ఉంటుంది. వీరు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

లేటెస్ట్

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

Show comments