Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీతో శ్రీలంక ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుందా.. ఆయనెందుకు సంతకం చేస్తున్నారు?

Webdunia
బుధవారం, 18 ఫిబ్రవరి 2015 (10:19 IST)
అదేంటి ఆయన శ్రీలంక దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కదా..! అవును.. ఆయన మైత్రిపాల సిరిసేనే... అదేంటి ఆయనతో టీటీడీ జేఈవో శ్రీనివాస రాజు సంతకం చేయిస్తున్నారు.. శ్రీలంక టీటీడీతో ఏదైనా ప్రత్యేక ఒప్పందాలు చేసుకుందా..? అయ్యోయ్యో... ఇంకా ఎక్కువ సేపు ఆగితే వేంకటేశ్వర స్వామిని శ్రీలంక పంపే ఆలోచన చేసినా ఆశ్చర్య పోనక్కర లేదు. సాంప్రదాయం ప్రకారం వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నట్లు సంతకం చేస్తున్నారంతే. వివరాలు...
 
సాధారణంగా తిరుమలకు వచ్చే విదేశీ ప్రముఖులు, ఇతర మతస్తులు వేంకటేశ్వసర స్వామిని దర్శించుకోవాలంటే మొదటగా ఆయనపై విశ్వాసాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. వేంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉన్న ప్రముఖులు, ఇతర మతస్తులు మాత్రమే వేంకటేశ్వర స్వామి దర్శనానికి అర్హులవుతారు. అందుకే ఇలా విదేశీ ప్రముఖులు, ఇతర మతస్తుల వద్ద సంతకాలు చేయిస్తారు. ఇది వేంకటేశ్వర స్వామి కీర్తి ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేస్తుంది. 
 
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తిరుమల చేరుకున్న సందర్భంగా ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కలిశారు. ఆయనకు ఆలయ సాంప్రదాయం ప్రకారం, భారతీయ సాంప్రదాయం ప్రకారం మర్యాదలు చేశారు. అనంతరం జేఈవో శ్రీనివాస రాజు ఆయన వద్ద ఆలయ సాంప్రదాయాన్ని తెలియజేసే పుస్తకంలో ఇలా సంతకం చేయించుకున్నారంతే. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments