తిరుమల గిరులకు పోటెత్తిన భక్తజనం

Webdunia
శనివారం, 23 మే 2015 (08:26 IST)
పదో తరగతి, ఎంసెట్‌ ఫలితాలు వెలువడడంతో విద్యార్థులు మొక్కులు తీర్చుకోవడానికి తిరుమలకు క్యూకట్టారు. శనివారం ఉదయం కూడా కొండ కిటకిటలాడింది. దీనికి వారాంతపు రద్దీ తోడవడంతో తిరుమలంతా జనమే జనం. దీంతో సర్వదర్శనానికి 20 , దివ్యదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సర్వ, దివ్యదర్శన క్యూలైన్లు క్యూకాంప్లెక్సులు నిండి నారాయణగిరి ఉద్యానవనంలోకి కిలోమీటర్‌కు పైగా వ్యాపించాయి. 
 
మహాలఘు దర్శనం నిరంతరాయంగా కొనసాగుతున్నా రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. ఆలయం ముందు, నాలుగుమాడ వీధులు, అఖిలాండం, లడ్డూ వితరణశాల, నిత్యాన్న సముదాయం, కల్యాణకట్ట భక్తులతో కిక్కిరిశాయి. వచ్చిన వారికి వచ్చినట్లు కేటాయిస్తుండడంతో గదులన్నీ సాయంత్రానికే నిండిపోయాయి. ఆ తర్వాత వచ్చిన భక్తులు వసతి సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డారు. ఆదివారం రద్దీ మరింత పెరిగే అవకాశాలున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

AI Impact Summit 2026, ఢిల్లీ లగ్జరీ హోటల్‌లో ఒక్కరోజుకి రూ. 25 లక్షలు

ఇద్దరు అనాథ పిల్లలకు తన జీతం నుంచి నెలకి రూ. 10,000 డిప్యూటీ సీఎం పవన్ సాయం

మానసికస్థితి సరిగాలేని టెక్కీ రైలు పట్టాలపై పడుకున్నాడు.. తల మొండెం వేరయ్యాయి...

ప్లీజ్.. మాకు ఇంకో వందే భారత్ రైలును కేటాయించరూ... రైల్వే మంత్రికి సీఎం బాబు వినతి

కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్ల పరువునష్టం దావా వేసిన అస్సాం సీఎం

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆచార్య చాణక్య నీతి శాస్త్రం.. నిద్రపోయే ముందు ఏం చేయాలి.. నేటి తప్పులను?

07-02-2026 శనివారం ఫలితాలు- గ్రహస్థితి అనుకూలంగా లేదు.

06-02-2026 శుక్రవారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దల సలహా తీసుకోండి...

Mahashivratri 2026: మహా శివరాత్రి రోజున రాజయోగాలు.. ఆ మూడు రాశులకు అదృష్టం

05-02-2026 గురువారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం...

Show comments