తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 26 కంపార్టుమెంట్లు నిండాయి. వారాంతం కావడంతో శుక్రవారం సాయంత్రమే భక్తుల తాకిడి పెరిగింది. ఇది శనివారం మరింత పెరిగే అవకాశం ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి.