శ్రీవారి ఆనంద నిలయంపై రావి మొలక... ఎప్పుడు?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (08:21 IST)
పేరు ప్రతిష్టలు సంపాదించిన తిరుమల తిరుపతి దేవస్ధానం శ్రీవారి ఆలయం పట్ల అశ్రద్ధతో ఉందనే విషయం మరోమారు స్పష్టమయ్యింది. ఆలయంపై రావి మొక్కలు మొలుస్తున్నాయి. అప్పుడప్పుడు ఆనంద నిలయం పై భాగాన్ని పరిశీలిస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రావి మొక్కలు బంగారు తొడుగులను కూడా చీల్చుకుని వస్తున్నాయి. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయ గోపురంపై రావిమొలక వచ్చింది!
 
ఆలయ గోపురాలపై రావి మొక్కలు మొలుస్తుంటాయి. అందుకు తిరుమల ఆలయం ప్రత్యేకం ఏమి కాదు. అయితే ఆలయగోపురంపై బంగారు పూత పూసిన రేకులు బిగించి ఉంటారు. అయితే వాటికి పూత పూయడం.. శుభ్రపరచడం జరుగుతుంటుంది. అయితే ఆనందనిలయం ఆగ్నేయదిశలో ఓ రావి మొక్క పెరుగుతోంది. 
 
బ్రహ్మోత్సవాలకు ఆలయ పైభాగంలో రంగులు వేయడంవంటి పనులు చేస్తున్నా ఈ మొలకను ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం. చాలా గోపురాలు కూలిపోవడానికి రావిమొక్కలే కారణమనే విషయం టీటీడీకి గుర్తుండాలని పలువురు విమర్శిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

సిద్ధరామయ్య సీఎంగా సగకాలం ముగిసింది, ఇప్పుడు డీకె శివకుమార్ మిగిలిన సగకాల సీఎం

Mahanadu: వర్షిణితో చంద్రబాబు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో (video)

15 ఏళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు లాడ్జిలో అత్యాచారం

అన్నీ చూడండి

లేటెస్ట్

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

Show comments