Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆలయంపై ఎగిరిన జెట్ విమానం...! ఎన్నిమార్లు చెప్పినా లెక్కలేదు..!!

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2015 (11:51 IST)
నిన్న ఎయిరిండియా విమానం.. నేడు జెట్ విమానం రేపు మరో విమానం ఇలా విమానాలు శ్రీవారి ఆలయంపైనే ఎగురుతున్నాయి. నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించమని ఎన్ని మార్లు చెప్పినా బీజేపీ ప్రభుత్వానికి చెవికెక్కడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నన్నినాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి ట్రస్టీలం మేమే అన్నంతగా వ్యవహరించిన బీజేపీ నాయకులు నోరు మెదపడం లేదు. 
 
తిరుమల ఆలయంపై విమానాల ప్రయాణం మంచిది కాదని ఆగమశాస్త్ర పండితులు, టీటీడీ అధికారులు చాలాకాలంగా చెబుతున్నారు. యావత్తు హిందూ సమాజం కొలిచే దేవుడిని అత్యున్నత స్థానంలో చూస్తామని, ఆయనపైనే ప్రయాణం చేయడం శాస్త్రపరంగా మంచిది కాదని చెబుతున్నారు. అందుకే నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని కోరుతున్నారు.
 
అయితే గతంలో ఎప్పుడో ఒక్కమారు విమానం ఇలాగే ప్రయాణించినందుకు బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. తిరుమలపై విమానాలు ఎగురరాదని హెచ్చరించారు. నానా హంగామా చేశారు. నేడు అదే నాయకులు అధికారంలో ఉన్నారు. ఇటు దేవస్థాన పాలక మండలిలో సభ్యులుగా కూడా ఉన్నారు. వారు కూడా కనీసం నోరు మెదపకపోవడం విశేషం. 
 
ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా కేంద్రం నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించడం లేదు. గతంలో తిరుమలకు విచ్చేసిన కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు మాత్రం ఆలయంపై విమానాలు నడపకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అయితే నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించాల్సింది రక్షణ శాఖ అని ఆయన వివరించారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments