Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి గోదారమ్మకు నిత్యహారతి

Webdunia
బుధవారం, 1 జులై 2015 (09:56 IST)
పుష్కరాలు ఇంకా 14 రోజులు ఉన్నా అప్పుడే గోదావరికి పుష్కరశోభ వచ్చేసింది. అధికారులు పుష్కరహారతి ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యహారతిని ప్రారంభించనున్నారు. 
 
ఈనెల 14 నుంచి గోదావరి పుష్కరాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఒకటో తేదీ నుంచే ఆధ్యాత్మిక శోభ సంతరించుకోవాలన్న ఉద్దేశంతో పుష్కర హారతిని ప్రవేశపెడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం ఆరున్నర గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. దీన్ని ప్రభుత్వం, బుద్ధవరపు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్త నిర్వహణలో నిత్యహారతి ఇవ్వనున్నారు. 
 
రాజమండ్రికి వడ్డాణాలుగా కీర్తించబడుతున్న హేవలాక్‌, ఆర్చీ వంతెన మధ్య నదిలో హారతి ఇచ్చేందుకు జిల్లా యంత్రాగం ఏర్పాట్లు చేసింది. దీంతోపాటు ఉదయం నుంచి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హారతి క్రతువు ముగిసిన తరువాత అరగంట పాటు బాణసంచా వెలుగులతో రాజమహేంద్రి కళకళలాడేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పుష్కర ఘాట్‌ను సుందరంగా తీర్చిదిద్దారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments