నేటి నుంచి గోదారమ్మకు నిత్యహారతి

Webdunia
బుధవారం, 1 జులై 2015 (09:56 IST)
పుష్కరాలు ఇంకా 14 రోజులు ఉన్నా అప్పుడే గోదావరికి పుష్కరశోభ వచ్చేసింది. అధికారులు పుష్కరహారతి ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యహారతిని ప్రారంభించనున్నారు. 
 
ఈనెల 14 నుంచి గోదావరి పుష్కరాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఒకటో తేదీ నుంచే ఆధ్యాత్మిక శోభ సంతరించుకోవాలన్న ఉద్దేశంతో పుష్కర హారతిని ప్రవేశపెడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం ఆరున్నర గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. దీన్ని ప్రభుత్వం, బుద్ధవరపు ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్త నిర్వహణలో నిత్యహారతి ఇవ్వనున్నారు. 
 
రాజమండ్రికి వడ్డాణాలుగా కీర్తించబడుతున్న హేవలాక్‌, ఆర్చీ వంతెన మధ్య నదిలో హారతి ఇచ్చేందుకు జిల్లా యంత్రాగం ఏర్పాట్లు చేసింది. దీంతోపాటు ఉదయం నుంచి వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హారతి క్రతువు ముగిసిన తరువాత అరగంట పాటు బాణసంచా వెలుగులతో రాజమహేంద్రి కళకళలాడేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పుష్కర ఘాట్‌ను సుందరంగా తీర్చిదిద్దారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌ను జైలులో పెట్టండని జనసేన చెప్పలేదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ భేషరతుగా వ్యాఖ్యల ఉపసంహరణ

తెలంగాణకు అరుదైన గౌరవం.. పోచంపల్లి ఇకాట్‌ను ధరించి కేన్స్‌లో మెరిసిన రష్మీ

ఏపీ రాష్ట్రంలో సీ ప్లేన్ ప్రాజెక్టు ప్రారంభానికి కీలక ప్రోత్సాహం.. రూ.200 కోట్లు కేటాయింపు

కడపలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ కొత్త శాఖ: రూ. 50 లక్షల వరకు స్పాట్‌లో మంజూరు

నిప్పుల కుంపటిగా తెలుగు రాష్ట్రాలు - పిడుగురాళ్లలో రికార్డు స్థాయిలో 48 డిగ్రీలు

అన్నీ చూడండి

లేటెస్ట్

22-05-2026 శుక్రవారం ఫలితాలు - అనుకూలతలు అంతంత మాత్రమే

21-05-2026 గురువారం ఫలితాలు - రుణ విముక్తులవుతారు

Tamil Nadu: కరుప్పుస్వామి ఆలయం... భక్తులకు ప్రసాదంగా నాణేలు.. వీడియో వైరల్

20-05-06 బుధవారం ఫలితాలు - అన్ని విధాలా శుభమే జరుగుతుంది

Chaturthi vrat: బుధవారం రోజున చతుర్థి వ్రతం పాటిస్తే..?

Show comments