ఈ నెల 5 నుంచి పోస్టాఫీసుల్లో తిరుమల దర్శనం టికెట్లు

Webdunia
శనివారం, 3 జనవరి 2015 (09:00 IST)
తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లను ఈ నెల 5 నుంచి పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంటాయని చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ తెలిపారు. ‘పిడికెడు బియ్యం’ పథకం కింద పోస్టల్ సిబ్బంది సేకరించిన బియ్యాన్ని శుక్రవారం ఆయన హైదరాబాద్ నగరంలోని వృద్ధాశ్రమానికి అందజేశారు.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లోని 56, తెలంగాణలోని 39 ప్రధాన తపాలా కార్యాలయాల్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మేరకు టికెట్లను తమకు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. పోస్టాఫీసుల్లో రూ.300 చెల్లించి ఆ టికెట్లను పొందవచ్చునని చెప్పారు. తరువాత నిర్ణయించిన సమయం మేరకు దర్శనానికి తిరుమలకు వెళ్ళితే టికెట్లు ఉన్న భక్తులకు దర్శనం లభిస్తుందని చెప్పారు. 
 
గాంధీనగర్ పోస్టాఫీస్ సిబ్బంది సేకరించిన 50 కేజీల బియ్యాన్ని కానూరులోని వృద్ధాశ్రమానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సంపత్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

తెలంగాణాలో బతకాలంటే ప్రత్యేక పాస్‌పోర్టు కావాలా? బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజస్థాన్‌లో దారుణం : నలుగురిని హత్య చేసి దహనం చేసిన మాజీ సర్పంచ్ మొదటి భార్య

నీట్ పేపర్ లీక్ లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందే : సుప్రీంకోర్టు

స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు : కాలుష్య రహిత గోదావరి కోసం నిరంతర తనిఖీలు : పవన్ ఆదేశం

అన్నీ చూడండి

లేటెస్ట్

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

Show comments