Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతి లడ్డూ రుచి ఏమయ్యింది...? డయల్ యువర్ ఈవోలో భక్తులు

Webdunia
శనివారం, 4 జులై 2015 (08:10 IST)
సార్... తిరుమల లడ్డూ రుచి బాగా తగ్గింది ఎందుకని? తగినన్ని మోతాదులో దినుసులు వేయడం లేదా...? పరిస్థితులను గమనించండి అంటూ భక్తులు తిరుమల తిరుపతి  దేవస్థానం ఈవో డి.సాంబశివరావులను ప్రశ్నించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో అనేకమైన సమస్యలను వారు లేవనెత్తారు. వివరాలిలా ఉన్నాయి. 
 
తిరుమల శ్రీవారి లడ్డూ రుచి తగ్గిందని కడపకు చెందిన కృష్ణకాంత్‌రెడ్డి, చిత్తూరుకు చెందిన గోపి డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఇందులో తేడా ఏమి ఉండదనీ, అయినా సరే పరిశీలిస్తామని ఈవో వారికి సమాధానం చెప్పారు. 
 
అనధికార హాకర్స్‌ మాఫియాను అరికట్టాలని తిరుపతికి చెందిన కుమార్‌ అనే భక్తుడు ఈవో దృష్టికి తెచ్చారు. కాలి నడక మార్గంలో చిరుతలు కనిపిస్తుండటంతో భయమేస్తుందని జయలక్ష్మి (యూఎస్‌ఏ) తెలిపారు. ప్రధానంగారూ.300 టికెట్ల ఆన్‌లైన్‌ విధానంపై సూర్యసుబ్రహ్మణ్యం(పశ్చిమగోదావరి జిల్లా, పెనుగొండ),రామస్వామి(బెంగళూరు), వెంకటసూరప్పరావు(విశాఖ జిల్లా,కొత్తపాళెం),శ్రీనివాస్‌(కామారెడ్డి), రేఖ(చెన్నై), రాజ్‌ (తిరునల్వేలి), హేమలత(హైదరాబాద్‌) తదితరులు పలు సందేహాలను వ్యక్తం చేశారు. 
 
దీనిపై ఈవో మాట్లాడుతూ.. రూ.300 టికెట్లు సులభంగా లభించేలా కోటాను పెంచి.. ఆన్‌లైన్‌ విధానాన్ని మరింత సరళీకృతం చేశామన్నారు. తిరుపతి లోని విష్ణునివాసం గదుల కేటాయింపులో అక్కడి సిబ్బంది సరిగా సమాధానం ఇవ్వడం లేదని శ్రీనివాస్‌(నరసన్నపేట) ఈవో దృష్టికి తెచ్చారు. శ్రీవారి సేవకు వస్తున్న వారికి జ్ఞాపిక లేక ధ్రువీకరణపత్రం ఇవ్వాలని కమలాకర్‌(నెల్లిమర్ల, విజయనగరం) కోరారు. 
 
తిరుత్తణిలో టీటీడీ సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కుమరేష్‌ (తిరుత్తణి) కోరారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ 1, 2లలో వైద్యసదుపాయం లేదని బ్రహ్మం(గుంటూరు) తెలిపారు. కాలినడకన వచ్చే భక్తులకు తాగునీరు, ఎనర్జీ డ్రింక్స్‌ అందించాలని శేఖర్‌(మహబూబ్‌నగర్‌) కోరారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments