Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ తిరుపతికి గ్రీన్ సిగ్నల్... ఇక రంగంలోకి దిగుతాం.. టీటీడీ ఛైర్మన్ చదలవాడ

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2015 (08:02 IST)
తిరుపతి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులే కాకుండా తాము కూడా ఆ బాధ్యతలను తీసుకుంటామని ఆయన చెప్పారు. తిరుమల తరహాలో తిరుపతిని తీర్చిదిద్దుతామని, స్మార్టుకు మరింత వన్నె తెస్తామని చెప్పారు. సుందరీకరణ పనులు, ఆధ్యాత్మిక మార్గదర్శక నగరంగా చేపతామని చెప్పారు. 
 
తిరుపతి పద్మావతి అతిథిగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల, తిరుపతిలలో నీటికొరత లేకుండా చూడటానికి గాలేరు-నగరి ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఆమోదం పొందాయన్నారు. తిరుపతిలోని రోడ్ల నిర్మాణాలకు, అభివృద్ధికి తితిదే తరఫున మొదటి విడతగా రూ.10 కోట్లు విడుదల చేశామన్నారు. తిరుపతి నగరం సుందరీకరణలో భాగంగా డ్రైనేజీ వ్యవస్థ, ఉద్యానవనాలను పెంపొందిస్తామన్నారు. ఇక కపిల తీర్థం పై భాగంలో ఓ రిజర్వాయర్‌ను నిర్మించి తాగునీటి అవసరాలను తీర్చుతామని చెప్పారు. 
 
తిరుపతి సమీపంలోని వకులమాత ఆలయంతోపాటు నగరంలో ఉన్న వివిధ దేవాలయాల్లో నిత్య, దీపధూప, నైవేద్యాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించేలా తితిదే చర్యలు పడుతోందని వివరించారు. తిరుపతి నగరానికి విచ్చేసే భక్తులకు తిరుమలలో ఉండే అనుభూతి పొందేందుకు తితిదే చేస్తున్న అభివృద్ధి పనులకు స్థానికులు చేయూతనందించాల్సిన అవసరం ఉందన్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments