Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యప్ప స్వామి దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ ఆరంభం

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (11:36 IST)
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ సేవలు ప్రారంభమయ్యాయి. శబరిమలలో నవంబరు 16వ తేది మండల పూజ ప్రారంభమవుతుంది. స్వామి దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం ఉన్న విషయం తెలిసింది. ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునేందుకు భక్తులు సంబంధిత వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవచ్చును.
 
ఆ వెబ్‌సైట్‌లో భక్తులు తమ పేరు, చిరునామా, ఫోటోను జత చేసి వర్చువల్ క్వ్యూ కార్డును రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ రిజిస్టర్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డును తీసుకుని సూచించిన టైం కంటే అర గంట ముందుగా  పంబకు వెళ్లినట్లైతే అక్కడ ఉన్న ప్రత్యేక కేంద్రంలో అధికారులు పరిశీలించి కొండపైకి ఎక్కేందుకు అనుమతిస్తారు.
 
ఈ విధానం ద్వారా ఒక గంట సేపటిలో ఆలయానికి చేరుకుని 18 మెట్లు ఎక్కి, అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవచ్చును. ఈ సేవ నవంబర్ 16వ తేది నుంచి డిసెంబర్ 27వ తేది వరకు అందుబాటులో ఉంటుంది. ఇంటర్నెట్ సౌకర్యం 2015 జనవరి నెలల జరిగే మకర దీప పూజ వరకు ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments