Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాధారణ భక్తులకు అందుబాటులో 225 సేవా టికెట్లు

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (06:49 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి వేకువజామున నిర్వహించే వివిధ సేవా టికెట్లను టిటిడి భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. శ్రీవారికి నిత్యం నిర్వహించే సేవ లైన తోమాల, అర్చన, మేల్‌చాట్‌ వస్త్రం, పూరాభిషేకం లాంటి టికెట్లను మార్చి నెలలో భక్తులకు టిటిడి సుమారు 225 టికెట్లను అందుబాటులో ఉంచింది. 
 
ఆర్జిత కుంభకోణంలో బయపడిన బల్క్‌ బుకింగ్‌ సేవాటికెట్లను టిటిడి రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ టికెట్లను ల్యాటరి పద్దతిలో భక్తులకు ప్రతినెలా అందజేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెలలో తోమాల సేవ 41, అర్చన సేవ 129, మేల్‌చాట్‌ వస్త్రం 09, పూరాభిషేకం 46 టికెట్లను కేటాయించింది. 
 
ఈ టికెట్లను పొందడానికి భక్తులు సేవ జరిగే ముందురోజున తిరుమలకు చేరుకుని సిఆర్‌ఓ కాంప్లెక్సులో ఉన్న విజయాబ్యాంకులో తమ పేర్లను, చిరునామాను, ఫోటో ఐడెంటీని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాలతో పాటు తమ మెబైల్‌ నెంబర్‌ ను కూడా ఎంట్రి చేసుకోవాలి. ఈ విధంగా సేవ జరిగే ముందురోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. శుక్రవారం సేవలకు సంబంధించిన టికెట్లను గురువారం తిరుమలలో లాటరీ పద్దతిన తీశారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments