Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ రామనవమి రోజున రాముని సందేశం పాటించండి

రాముని జన్మదినంరోజున ఆయన ఆదర్శాన్నికూడా ఆపాదించండి

Gulzar Ghouse
భారత దేశం పండుగల దేశం. మన దినచర్యలలోనే పండుగలున్నాయి. అలాంటిదే శ్రీరామనవమి. రాక్షసులను సంహరించడానికి విష్ణుభగవానుడు రాముని రూపంలో అవతరించాడు. తను మర్యాదా పూర్వకమైన జీవితాన్ని గడిపి పురుషోత్తముడైనాడు. నేటికీ పురుషోత్తముని జన్మదినం చాలా ఘనంగా జరుపుకుంటుంటారు. కాని ఆయన పాటించిన ఆదర్శాలను మాత్రం ఎవ్వరూకూడా పాటించడంలేదు.

అయోధ్యకు రాజకుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడు తన తండ్రి మాటను జవదాటకుండా తన రాజవైభోగాన్ని త్యజించి(వదిలి) 14సంవత్సరాలు వనవాసం చేసిన మహాత్యాగశీలి ఆయన. కాని నేడు ఇలాంటి కుమారులు ఎంతమంది ఉన్నారు. తమ వైభవాలను వదులుకునేందుకు ఇష్టపడని ప్రభృతులు చివరికి తమ తల్లిదండ్రులను కాల్చుకు తింటున్నారు.

మన దేశంలో శ్రీరామ నవమి, శ్రీకృష్ణ జన్మాష్టమిని చాలా సంతోషకరమైన వాతావరణంలో జరుపుకుంటారు. కాని వారు చూపిన ఆదర్శాలు, సందేశాలనుమాత్రం పాటించడంలేదు. శ్రీకృష్ణుడు అర్జునునికి ఇచ్చిన గీతోపదేశం నేడు కేవలం ఓ పుస్తకంలా ఉండిపోయింది.

మహాకవి తులసీదాస్ రచించిన శ్రీరామచరిత మానస్‌లో భగవంతుడు శ్రీరాముని జీవిత చరిత్ర వర్ణిస్తూ...శ్రీరాముడు ఉదయం నిద్ర లేవగానే తన తల్లిదండ్రుల చరణాలకు నమస్కరించేవారు. కాని ప్రస్తుతం తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం కన్నాకూడా వారు చెప్పిన మాటలను ఎంతమంది పాటిస్తున్నారు...?

ప్రస్తుతం పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే మహాపురుషుల చెప్పిన, చూపిన ఆదర్శాలు కేవలం టీవీలలో ధారావాహిక కార్యక్రమాలుగా, పుస్తకాలలో కథలలాగా ఉండిపోయాయి. మన దేశ నాయకులుకూడా తమ అధికారంకోసం శ్రీరామనామం జపిస్తుండటం గమనార్హం.

రామునిపేరుతో ఓట్లను దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప వారి ఆదర్శాలను పాటించడం లేదని పెద్దలు వాపోతున్నారు. నిజంగానే శ్రీరామున్ని ఆరాధించేవారైతే, రామరాజ్యం స్థాపించాలనుకుంటుంటే "జయ్ శ్రీరామ్" ను ఉచ్చరించే ముందు రాముని ఆదర్శాలను పాటించండి. ఆ తర్వాతే రామ రాజ్యం కోసం తాపత్రయపడండి. అధికారంకోసం ఆదర్శాలను తుంగలో తొక్కకండని అంటున్నారు సీనియర్ సిటిజన్స్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

లేటెస్ట్

తన మనవడికి భగవద్గీత నేర్పిస్తున్న రజాకార్ నిర్మాత

Bonalu: జూన్ 26 నుండి గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభం

28-05-2025 బుధవారం దినఫలితాలు - ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు...

Goddess Lakshmi: శ్రీ లక్ష్మీదేవికి ప్రీతికరమైన రాశులు ఏంటో తెలుసా?

TTD: వేసవి సెలవులు-తిరుమలలో భారీ రద్దీ.. అయినా ఏర్పాట్లతో అదరగొట్టిన టీటీడీ

Show comments