Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం చేసే సమయంలో బిస్కెట్లు తింటున్నారా?

భోజనం చేసే సమయంలో బిస్కెట్లు తింటున్నారా? సమోసాలు లాగిస్తున్నారా? అయితే కాస్త ఆగండి. భోజనం కాకుండా ఇతర పదార్థాలు లంచ్ టైమ్‌లో తీసుకుంటే.. టైప్ టు డయాబెటిస్ తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇ

Webdunia
శనివారం, 13 మే 2017 (13:34 IST)
భోజనం చేసే సమయంలో బిస్కెట్లు తింటున్నారా? సమోసాలు లాగిస్తున్నారా? అయితే కాస్త ఆగండి. భోజనం కాకుండా ఇతర పదార్థాలు లంచ్ టైమ్‌లో తీసుకుంటే.. టైప్ టు డయాబెటిస్ తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ప్రతిరోజూ క్రమం తప్పకుండా సమయానికి ఆహారం తీసుకోకపోతే డయాబెటిస్ తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. భోజనం చేయకుండా ఉండే వారిలో, వేళాపాళా లేకుండా భోజనం చేసే వారిలోనూ మెటబాలిక్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
 
పని ఒత్తిడితో వేళాపాళా లేకుండా భోజనం చేస్తే ఒబిసిటీ కూడా తప్పదు. ఆరోగ్యంగా ఉండాలంటే క్రమంతప్పకుండా ఒకే వేళకు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. అలాగని రోజంతా తింటూ ఉండకూడదు. ముప్ఫై ఏళ్ళ లోపు వారైతే, రోజుకు మూడు పూటలా తినడం మీ జీవితానికి సరిగ్గా సరిపోతుంది. అదే మీకు ముప్ఫై పైబడి ఉంటే, ఆహారాన్ని రోజుకు రెండు పూటలకే తగ్గించడం ఉత్తమం. కడుపు ఖాళీగా ఉన్నప్పుడే మన శరీరం, మనుసు అత్యుత్తమంగా పనిచేస్తాయి. అందుకే సగం కడుపు ఖాళీగా ఉండేట్లు ఆహారం తీసుకుని.. ఆకలేస్తే పండ్లు, సలాడ్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments