Webdunia - Bharat's app for daily news and videos

Install App

విటమిన్ డి, ఈతో ఒబిసిటీకి చెక్.. తృణధాన్యాలు తీసుకోండి.!

Webdunia
గురువారం, 19 నవంబరు 2015 (20:07 IST)
ఒబిసిటీతో ఇబ్బందులు పడుతున్నారా? రోజూ ఏసీల కింద కూర్చుని గంటల పాటు కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారా? అయితే లోపం అక్కడే వుందని గమనించండి. బరువు పెరగడానికి విటమిన్ ఈ లోపం కూడా కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక బరువు, ఒత్తిడి, శారీరక రుగ్మతలు, ఆహారపు అలవాట్ల వలన ఏర్పడుతుంది. ఇవన్నీ కాకుండా విటమిన్ డీ లోపంతో కూడా బరువు పెరుగుతారని తాజా పరిశోధనలో తేలింది. సూర్య కిరణాలు ఒంటిపై పడకపోవడం ద్వారా బరువు పెరుగుతారని.. సూర్యోదయం, సూర్యాస్తమ కిరణాలైనా శరీరంపై పడేలా పది నిమిషాలు ఎండలో నిలబడాలని వారంటున్నారు. 
 
అలాగే ఒత్తిడిని నియంత్రించేందుకు ''డి'' విటమిన్‌తో పాటు 'ఈ' విటమిన్ ఎంతో ఉపయోగపడుతుందని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు సూచిస్తున్నారు. 'ఈ' విటమిన్ తృణధాన్యాలు, ఆలివ్ నూనెల్లో పుష్కలంగా లభిస్తుంది. ఈ విటమిన్ శరీరానికి అందడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలు దూరమవుతాయని.. ఈ కొరత ఏర్పడితే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.  
 
స్థూలకాయుల రక్తంలో విటమిన్ 'ఈ' ఉంటుంది కానీ, కొవ్వు అధికంగా నిల్వ ఉండే శరీరాల్లో మాత్రం విటమిన్ 'ఈ' లోపించి ఉంటుందని పరిశోధకులు చెప్పారు. కొవ్వు అధికంగా ఉన్నవారికి విటమిన్ 'ఈ' అందిస్తే అధిక బరువు సమస్యను నియంత్రించవచ్చునని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. 

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments