అంతర్గత ఆరోగ్యం కోసం ఏం చేస్తున్నారు...?

బాహ్య సౌందర్యం మీద శ్రద్ధ పెరిగి అంతర్గత ఆరోగ్యాన్ని మరిచిపోతున్నారు. ముఖం కడిగి పౌడర్ పూసి జుట్టు దువ్వి అందంగా తయారయ్యేందుకు ఎన్నో కాస్మోటిక్స్ వాడటం ఇటీవలి కాలంలో అధికమైంది. కానీ శరీరంలోచేరిన మలిన పదార్థాలను బయటకు పంపడం, ప్రమాదకర పదార్థాలను విచ్ఛి

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2017 (18:21 IST)
బాహ్య సౌందర్యం మీద శ్రద్ధ పెరిగి అంతర్గత ఆరోగ్యాన్ని మరిచిపోతున్నారు. ముఖం కడిగి పౌడర్ పూసి జుట్టు దువ్వి అందంగా తయారయ్యేందుకు ఎన్నో కాస్మోటిక్స్ వాడటం ఇటీవలి కాలంలో అధికమైంది. కానీ శరీరంలోచేరిన మలిన పదార్థాలను బయటకు పంపడం, ప్రమాదకర పదార్థాలను విచ్ఛిన్నం చేసి ప్రమాద రహితమైనవిగా మార్చేందుకు అనుసరించాల్సినవి మాత్రం చేయడంలేదు. 
 
కాలేయం, మూత్రపిండాలు అంతర్గత మలినాలను వదిలించుకునే బాధ్యతను నిర్వహిస్తాయి. ఇవేకాక శోషరస వ్యవస్థ ముఖ్యపాత్ర వహిస్తుంది. అటువంటి వ్యవస్థలు దెబ్బతినకుండా చూసుకోవాలి. వాటి మెరుగైన పనితీరు బాగుండాలంటే శరీరానికి తగినంత నీరు అందించాలి. కేవలం దాహం వేసినపుడే నీరు తాగుతాను అనుకుంటే ఇబ్బంది వస్తుంది. 
 
రక్తంలో పలురకాల మలినాలు చేరుతుంటాయి. వాటిని వదిలించకపోతే పలు అనారోగ్యాలు వస్తాయి. అందుకు తగినంతనీరు తాగి రక్త శుద్ధి జరిగేట్లు చూసుకోవాలి. ఎంత స్వచ్చ మైన నీరు, ఎంత ఎక్కువ మోతాదులో అందిస్తే శరీరానికి అంత మంచిది. గాలి కూడా ఒరరకమైన ఇంధనం. గాలి బాగా పీల్చి వదలగలిన యెగా, ఎయిరోబిక్స్ వంటివి తప్పకుండాచేయాలి. 
 
జీర్ణ వ్యవస్థలో తయారయ్యే వ్యర్థాలు మల రూపంలో బయటకు పంపబడాలి. మలం ఎక్కువ సేపు నిలువ ఉండకూడదు. కాబట్టి రోజూ మల విసర్జన చేయాలి. ఇది క్రమబద్ధంగా ఉండాలంటే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. మలబద్దకం రానివ్వని తాజా కూరగాయలు, ఆకు కూరలు ఆహారంగా తీసుకోవాలి. శరీరం విషయంలో కొద్దిపాటి శ్రద్ధ మనం చూపితే ఆ శరీరంలోని అంగాలు మనకు ఆరోగ్యం, ఆనందం అందిస్తాయి. బ్రతికినంత కాలం హుషారుగా వుండవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గిల్లితే కాటేస్తాం, ఇరాన్ వార్నింగ్: ట్రంప్ 5 అడుగులు వెనక్కి, యుద్ధం విరమణ అంటూ...

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేదే హవా.. టీవీకే, ఎన్టీకేలకు ఓటమి తప్పదు.. సర్వే

పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు.. టీవీకే 30మంది అభ్యర్థుల జాబితా రిలీజ్

సువర్ణాధ్యాయం లిఖించిన 'బ్లాక్ టైగర్' : ఎవరీ అసమాన దేశభక్తుడు!!

కోతుల గుంపు దాడి.. కాకినాడలో 65 ఏళ్ల వృద్ధురాలు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments