Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణులు మెుక్కజొన్న తింటే..?

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (10:45 IST)
మెుక్కజొన్న చలికాలంలో ఎక్కువగా దొరుకుతాయి. కార్న్ గింజల్ని గ్రేవీలో వేసి ఫ్రైడ్‌రైస్‌తో కలిపి తీసుకోవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వంటి వాటితో కూడా చేర్చి సాయంకాలం వేళ స్నాక్స్‌గా కూడా తినొచ్చు. మొక్కజొన్న పొత్తులను సాధారణంగా నిప్పులపై వేడిచేసి బాగా కాలిన తర్వాత తింటారు. ఎలా తిన్నా మొక్కజొన్న రుచికి మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
 
మొక్క‌జొన్నలో ఫ్లేవ‌నాయిడ్స్ అని పిల‌వ‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ‌రీరంలో ఏర్ప‌డే ఫ్రీ ర్యాడిక‌ల్స్ ప్ర‌భావాన్ని త‌గ్గిస్తాయి. దీని కార‌ణంగా క్యాన్స‌ర్లు రావు. మెుక్కజొన్నలో బీటా కెరోటిన్‌, విట‌మిన్ ఎ, విట‌మిన్ సి ఉండ‌డం వ‌లనే మ‌న చ‌ర్మానికి సంర‌క్ష‌ణ క‌లుగిస్తుంది. చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. 
 
జింక్‌, పాస్పర‌స్‌, మెగ్నిషియం, ఐర‌న్‌లు, ఇత‌ర మిన‌రల్స్ మొక్క‌జొన్న‌లో ఉంటాయి. ఇవి ఎముక‌ల బ‌లానికి చాలా ఉపయోగపడుతాయి. ఎముక‌ల‌కు దృఢ‌త్వం క‌లుగుతుంది. కీళ‌్లనొప్పులతో బాధప‌డేవారు మొక్క‌జొన్న‌ల‌ను ఆహారంలో భాగం చేర్చుకుంటే అనారోగ్య సమస్యల నుండి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మొక్క‌జొన్న‌ల్లో ఐర‌న్ పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
 
మొక్కజొన్నలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. అవి జీర్ణక్రియకు బాగా తోడ్పడతాయి. పేగు క్యాన్సర్‌ను కూడా నివారిస్తుంది. మొక్కజొన్న గింజలు చాలా బలవర్ధకమైన ఆహారం. దీంట్లో ఉండే లవణాలు, విటమిన్స్ ఇన్సులిన్‌పై ప్రభావం చూపిస్తాయి. మధుమేహం ఉన్నవారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఫోలిక్ యాసిడ్ పుష్క‌లంగా ఉండ‌డం వ‌లన మొక్క జొన్న గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. వారి క‌డుపులోని బిడ్డ‌కు ఫోలిక్ యాసిడ్ ఎంతో అవ‌స‌రం. కాబ‌ట్టి మొక్క‌జొన్న‌ల‌ను గ‌ర్భిణీలు తింటే పుట్ట‌బోయే పిల్ల‌ల‌కు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రావు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)

పొట్టి దస్తులు ధరించే మహిళలు రాక్షసి శూర్పణఖలు : బీజేపీ మంత్రి కైలాస్ విజయ్

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

తర్వాతి కథనం
Show comments