Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరంలో చెడు నీరా.. ప్రొద్దు తిరుగుడు ఆకులు ఉత్తమం....

ప్రొద్దు తిరుగుడు చెట్టును సంస్కృతంలో సువర్చల అంటారు. దీని పువ్వు ఎప్పుడూ సూర్యుని వైపే తిరిగి ఉంటుంది. పూవు లోపల దుద్దు చుట్టూ చేమంతి పూవుకు వలె రేకులుంటాయి. ఈ చెట్టుకే రవిప్రియ అనే పేరు కూడా ఉంది.

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (14:13 IST)
ప్రొద్దు తిరుగుడు చెట్టును సంస్కృతంలో సువర్చల అంటారు. దీని పువ్వు ఎప్పుడూ సూర్యుని వైపే తిరిగి ఉంటుంది. పూవు లోపల దుద్దు చుట్టూ చేమంతి పూవుకు వలె రేకులుంటాయి. ఈ చెట్టుకే రవిప్రియ అనే పేరు కూడా ఉంది. ప్రొద్దు తిరుగుడు చెట్టు చేదు, వగరు, కారం రుచులతో వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. శరరంలోని కఫరోగాలను, పిత్తరోగాలను, శ్వాసరోగాలను, జ్వరాలను, చర్మరోగాలను, ప్రమేహాలను, రక్తదోషాలను పాండు వ్యాధిని హరిస్తుంది.
 
ప్రొద్దు తిరుగుడు గింజలతో చేసిన కషాయం అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణశక్తి లోపించిన వారు ప్రొద్దుతిరుగుడు గింజల తైలమును ప్రతిరోజు తగినంత మోతాదులో సేవిస్తే జీర్ణశక్తి అభివృద్ధి చెందుతుంది. ప్రొద్దు తిరుగుడు చెట్టు ఆకులను నీడలలో ఎండించి చూర్నము చేసి ఒక కప్పు పెరుగులో 1/2 చెంచా పొడిని వేసి, దానిలో 1/2 కప్పు దానిమ్మ పండు రసం కలిపి చారు కాచినట్లు వేడి చేసి దించి మూడు మూడు చెంచాల నెయ్యి చేర్చి దించి రెండు పూటలా త్రాగుతుంటే ఆమ్లముతో కడుపునొప్పుతో కూడి వేదించి ఆమ్లవిరేచనాలు త్వరగా తగ్గిపోతాయి.
 
ప్రొద్దు తిరుగుడు చెట్టు ఆకులు, పొట్ల చెట్టు ఆకులు రెండింటిని కలిపి ఆకు కూరలాగా వండి రెండు పూటలా తింటుంటే శరీరంలో చేరిన అధికమైన చెడు నీరు హరించిపోయి, ఉబ్బు రోగం హరించిపోతుంది. ప్రొద్దు తిరుగుడు చెట్టు ఆకులు పొడి 1/2 చెంచా మోతాదుగా ఒక కప్పు వేడి పాలలో వేసి దానిలో ఒక చెంచా త్రికటుచూర్ణం, మిరియాలు సమంగా కలిపి నూరిన చూర్ణం కలిపి రెండు పూటలా సేవిస్తే దగ్గు, దమ్ము, ఆయాసం తగ్గుతాయి. ప్రొద్దుతిరుగుడు చెట్టు వేరు బియ్యం కడిగిన నటితో నూరి గంథంలాగా అరగదీసి ఆ గంథం ఒక టీ స్పూను మోతాదుగా ఒక కప్పు బియ్యం కడిగిన నీటిలో కలిపి రెండుపూటలా సేవిస్తుంటే స్త్రీల సమస్యలు నివారణ అవుతాయి. 
 
తేలు కుట్టిన వెంటనే ప్రొద్దు తిరుగుడు చెట్టు ఆకును మెత్తగా నూరి రెండు ముక్కులతో బాగా వాసన చూడాలి. వాసన ఊసిన మరుక్షణమే తేలు విషయం నశించిపోయి నొప్పి, బాధ, మంట వెంటనే తగ్గిపోతాయి. ప్రొద్దు తిరుగుడు చెట్టును సమూలంగా మెత్తగా దంచి, ఆముద్దను రాత్రి నిదురించే ముందు కాలి పగుళ్ళపైన పట్టిస్తుంటే పగుళ్ళు పుండ్లు తగ్గిపోయి పాదాలు ప్రకాశవంతంగా, ఆరోగ్యవంతంగా తయారవుతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

భూమిపై ఆక్సిజన్ తగ్గిపోతుంది.. మానవుల మనుగడ సాధ్యం కాదు.. జపాన్ పరిశోధకులు

Belagavi: 14 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ యువకులు కిడ్నాప్ చేసి, ఫామ్‌హౌస్‌లో..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments