మండే ఎండల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి...

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (16:21 IST)
ఎండాకాలం వచ్చింది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండ వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఎండాకాలం సరైనా జాగ్రత్తలు తీసుకోకుంటే తిప్పలు తప్పవంటున్నారు. దీంతో పిల్లలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా, వేడిమికి డీహైడ్రేషన్, విరేచనాలు, చమటకాయలతో బాదపడుతున్నా వేసవిలో దాహార్తిని తీర్చే చల్లటి నీరు, కొబ్బరి బొండాలతో పాటు మజ్జిగ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
 
రోజంతా చర్మంపై తేమ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం వాటర్ కలిసిన మాయిశ్చరైజింగ్ క్రీమును రాసుకోవాలి. దానికంటే ముందుగా ముఖంపై రోజ్ వాటర్‌ను రాసుకుంటే మంచిది. చర్మం బాగా పొడిబారిపోయినప్పుడు సబ్బుతో ఎక్కువ సార్లు కడుక్కోవద్దు. దీనికి బదులుగా వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే తాజాగా ఉంటుంది.
 
అన్నింటికంటే ముందుగా చేయాల్సింది ఎక్కువ నీటిని తాగడం. సాధారణంగా మిగతా కాలాల్లో మీరు తీసుకుంటున్న నీటి కంటే రెండింతలు అధికంగా తీసుకోవాలి. అలాగే కీరదోస, క్యారట్, బీట్‌రూట్ లాంటి పచ్చికూరగాయలను కూడా తినవచ్చు.
 
సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై ముడతలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ కిరణాలు చర్మంలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి కొల్లాజెన్‌ను దెబ్బతీస్తాయి. దీంతో చర్మంపై ముడతలు ఏర్పడతాయి. కనుక సాధ్యమైనంత వరకూ ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిది. 
 
తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెంకొంచెంగా తీసుకోండి. విలువైన పోషకాలుండే పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ లాంటి పండ్లరసాలను ఎక్కువగా తీసుకోండి. మధ్యమధ్యలో చల్లని మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం మరింత మంచిది. దీనివల్ల దేహంలోని వేడి తగ్గడంతోపాటు విలువైన పోషకాలు లభిస్తాయి. చర్మం తాజాగా ఉంటుంది.
 
వేసవిలో ముఖంపై ఎక్కువగా జిడ్డు పేరుకుంటుంది. కనుక చల్లటి నీటితో కనీసం నాలుగైదు సార్లయినా కడుక్కోండి. ఎండలోంచి నీడకు వెళ్లిన వెంటనే కాకుండా కొంచెం సేపు ఆగి కడుక్కోండి. ఐస్‌తో ముఖంపై మర్దన చేసుకుంటే చర్మం మరింత తాజాదనం సంతరించుకుంటుంది. స్క్రబ్బర్‌లను ఉపయోగించకండి. దానివల్ల చర్మం మరింత పొడిబారుతుంది. వేసవిలో రెండు పూటల స్నానం చేయడం మంచిది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న అన్వేష్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి: కరాటే కల్యాణి

భారత్ -పాకిస్థాన్ కాల్పుల విరమణ వెనుక ఎవరి జోక్యం లేదు : భారత్

ఎంత ఖర్చయినా ఫర్వాలేదు, రైతు పుస్తకాల నుంచి జగన్ ఫోటోను తీసేయండి: సీఎం చంద్రబాబు

ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొన్న బొలెరో వ్యాను... డ్రైవర్ సజీవదహనం

కొత్త సంవత్సర సంబరాలు... మందుబాబులకు ఉచిత రవాణా సేవలు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ధురంధర్‌'కు రూ.90 కోట్ల నష్టాలు?

అమ్మా నన్ను క్షమించు. గవర్నమెంట్ జాబ్ చేయడం ఇష్టంలేదు..

iBomma నాదని మీకెవరు చెప్పారు?: ఇమ్మడి రవి షాకింగ్ రిప్లై

Ghantasala: ఘంటసాల ది గ్రేట్ మ్యూజికల్ కాన్సర్ట్‌.. సందడిగా సెలెబ్రిటీ ప్రివ్యూ షో

Anil Ravipudi: చిరంజీవి, వెంకటేష్ అల్లరి, డ్యాన్స్, ఆడియన్స్ గుర్తుపెట్టుకుంటారు: అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments