Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండు నల్ల ద్రాక్షలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే పరగడపున తింటే?

Webdunia
బుధవారం, 24 మే 2023 (18:32 IST)
ఎండు నల్లద్రాక్ష. వీటిలో యాంటీఆక్సిడెంట్లతో పాటు ఐరన్ పుష్కలంగా వుంటుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారు వీటిని తింటుంటే ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి చేయడంలో సాయపడతాయి. ఇంకా ఎండు నల్ల ద్రాక్షను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాత్రిపూట పది ఎండు నల్లద్రాక్షలను మంచినీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని పరగడుపున తింటే రక్తహీనత తగ్గుతుంది. నల్ల ఎండు ద్రాక్ష తింటుంటే శరీరానికి విటమిన్ సి అందుతుంది, ఫలితంగా కేశాలు బలంగా వుంటాయి.
 
తరచూ ఎండు ద్రాక్ష తింటుంటే రక్తంలో సోడియం మోతాదులు తగ్గుతూ రక్తపోటు అదుపులో వుంటుంది. ఎండు ద్రాక్షలో వున్న యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ వల్ల అవి తినేవారి చర్మం నిగనిగలాడుతుంది. నల్ల ఎండు ద్రాక్షలో క్యాల్షియం వుంటుంది, అందువల్ల అవి తింటే ఎముకలు దృఢంగా పెళుసుబారకుండా వుంటాయి. నల్ల ఎండు ద్రాక్ష కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాయపడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
 
నల్ల ఎండు ద్రాక్ష తింటే మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. ఛాతీలో మంట, అజీర్ణం తగ్గాలంటే నల్ల ఎండుద్రాక్షను తింటుండాలి.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments