Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం కడిగిన నీళ్లలో చందన చూర్ణం, చక్కెర కలిపి తీసుకుంటే?

Webdunia
శనివారం, 27 మే 2023 (22:37 IST)
తెల్లగంధం చెట్టు చలువ స్వభావంతో మనసుకి ఆహ్లాదాన్నిస్తుంది. కఫం, అలసట, విషాలు, దాహం, రక్తపైత్య రోగాలను అణిచివేస్తుంది. హరిచందనం ముఖంపై మంగుమచ్చలను తగ్గిస్తుంది. రక్త చందనం చలువ స్వభావాన్ని కలిగి వుంటుంది. ఈ గంధాలతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తుమ్ములు విపరీతంగా వస్తుంటే మేలురకమైన మంచిగంధం చెక్కను మాటిమాటికి వాసన చూస్తుంటే సమస్య పోతుంది.
 
మంచిగంధం పొడి, హారతి కర్పూరం సమంగా కలిపి మంచినీటితో మెత్తగా నూరి బొడ్డుపై పలుచగా లేపనం చేస్తే కడుపునొప్పి, నీళ్లవిరేచనాలు తగ్గుతాయి. ఎర్రచందనం, మంజిష్ట, లొద్దుగచెక్క, చంగల్వకోస్టు, మర్రిచిగుర్లు, నల్లపెసలు సమంగా తీసుకుని మంచినీటితో మెత్తగానూరి బొల్లి మచ్చలపై రాస్తే సమస్య తగ్గుతుంది.
 
మూత్రం సాఫీగా కాకుండా బొట్టుబొట్టుగా పడుతుంటే 3 గ్రాముల చందనచూర్ణం, 3 గ్రాముల చక్కెర కలిపి కప్పు బియ్యం కడిగిన నీటితో సేవిస్తే మేలు కలుగుతుంది. పాలతో గంధాన్ని అరగదీసి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. స్నానం చేసే నీళ్లలో గంధం నూనె అయిదారు చుక్కలు వేసుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు రావు. రోజ్ వాటర్‌లో గంధం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం మీద రాష్‌ వుంటే పోతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments