Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం కడిగిన నీళ్లను పారబోస్తున్నారా...? వద్దు ఇలా ఉపయోగపడ్తాయ్...

అన్నం వండే ముందు బియ్యాన్ని ఒకటికి మూడుసార్లు కడిగి ఆ నీళ్లను పారబోస్తుంటాం. కానీ వాటిలో ఔషధ విలువలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. బియ్యం కడిగిన నీళ్లలో ఫైబర్ వుండటంతో ఇవి చర్మ మరియు కేశ సంబంధ సమస్యలను నివారించడంలో చక్కగా పనిచేస్తాయంటున్నారు.

Webdunia
శనివారం, 22 జులై 2017 (19:37 IST)
అన్నం వండే ముందు బియ్యాన్ని ఒకటికి మూడుసార్లు కడిగి ఆ నీళ్లను పారబోస్తుంటాం. కానీ వాటిలో ఔషధ విలువలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. బియ్యం కడిగిన నీళ్లలో ఫైబర్ వుండటంతో ఇవి చర్మ మరియు కేశ సంబంధ సమస్యలను నివారించడంలో చక్కగా పనిచేస్తాయంటున్నారు.
 
మొటిమలు... 
టీనేజ్ వయసు వారికి మొటిమల సమస్య సాధారణంగా వుంటుంది. ముఖంపై ఇవి చూసేందుకు ఇబ్బందికరంగా వుండటంతో పాటు ఇరిటేషన్ కలిగిస్తుంటాయి. అలా ఇబ్బందిపడేవారు బియ్యం కడిగిన నీటిని ఉపయోగిస్తే చాలు. ఇందుకుగాను కొద్దిగా కాటన్ తీసుకుని బియ్యం కడిగిన నీళ్లలో ముంచి మొటిమలు వున్నచోట రాసి ఆ తడి పూర్తిగా ఆరిపోయేవరకూ అలాగే వుంచాలి. ఆ తర్వాత ముఖాన్ని కడిగేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే మొటిమలు మాయమవుతాయి.
 
చర్మంపై ముడతలు...
కొందరు వయసు తక్కువయినా చర్మంపై ముడతలు రావడంతో వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి. ఇలాంటివారు బియ్యం కడిగిన నీళ్లను ముడతలు వున్న చర్మంపై మర్దన చేస్తుంటే చర్మంపై వున్న ముడతలు పోయి నిగారింపు వస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

పహల్గామ్ ఉగ్రదాడి : కాశ్మీర్‌కు బుక్కింగ్స్‌ను రద్దు చేసుకుంటున్న టూరిస్టులు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

తర్వాతి కథనం
Show comments