Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరుశెనగ పల్లీలు తింటే కొవ్వు పెరుగుతుందా?

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (12:30 IST)
వేరుశనగ పప్పులు.. వీటినే పల్లీలు అని కూడా అంటారు. వీటిని తింటే లావు పెరిగిపోతారని, కొవ్వు పేరుకుపోతుందని, గుండె జబ్బులు వస్తాయని చాలా మంది అపోహ. అయితే ఇది ఎంత మాత్రం నిజం కాదు. వీటిని తింటే పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఉడకబెట్టి తినడం, వేయించుకుని తినడం లేదా పచ్చడి, కూరలు చేసుకుని తినడం ఇలాగ ఎలా అయినా తీసుకోవచ్చు. 
 
బెండకాయ ఫ్రైలో పల్లీలు, దొండకాయ ఫ్రైలో పల్లీలు, అంతేకాదు పల్లీలలో రకరకాల స్వీట్లు తయారు చేసుకుని తింటుంటారు. పల్లీలను తినడం వలన ఆలోచనాశక్తి పెరుగుతుంది. ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. పల్లీల్లో ప్రొటీన్‌లు పుష్కలంగా లభిస్తాయి. అవి ఆకలిని నియంత్రణలో ఉంచుతాయి. ప్రతిరోజూ 30 గ్రాముల పల్లీలు తీసుకున్నట్లయితే గుండె సంబంధిత వ్యాధులు రావని వైద్యులు, శాస్త్రవేత్తలు అంటున్నారు. 
 
పల్లీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్ హార్ట్ ఎటాక్ రాకుండా చూస్తాయి. అంతేకాదు శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మెదడు చురుకుగా పనిచేస్తుంది. గర్భిణులు నిత్యం పల్లీలు తీసుకుంటే అవసరమైన పోషకాలు అందుతాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి పల్లీలను ఆహారంలో భాగం చేసుకోండి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments