వెల్లుల్లి రసం, పావుగ్లాసు గోరు వెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే?

Webdunia
సోమవారం, 12 ఆగస్టు 2019 (21:10 IST)
ఈ రోజుల్లో చాలామంది నడుము నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళల సంగతి వేరే చెప్పక్కర్లేదు. ఇంటిపని, ఆఫీసు పని చేస్తూ పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. మహిళలు తరచూ నడుము నొప్పితో బాధపడుతుంటారు. అలాంటివారు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
1. ప్రతిరోజూ పది చుక్కలు వెల్లుల్లి రసం, పావుగ్లాసు గోరు వెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే, నడుం నొప్పి తగ్గుతుంది. అల్లంరసం, పసుపు కలిపి పాలతో తీసుకుంటే జీర్ణకోశం బాగుపడి నడుంనొప్పి తగ్గుతుంది. ఆవనూనె, నువ్వుల నూనె వేడిచేసి నడుముకు మర్ధనచేసుకుని వేడి నీళ్ళతో స్నానం చేస్తే, నడుంనొప్పి తగ్గుతుంది. 
 
2. ఒళ్ళు లావుగా ఉండి నడుంనొప్పి వుంటే, పావు గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఇరవై చుక్కలు నిమ్మపండు రసం పోసి పరగడుపున తాగితే, ఒళ్లు తేలికపడి నొప్పి తగ్గుతుంది. ఒక నిమ్మకాయ కోసి ఒక చెక్కను పల్చటి గుడ్డలో కట్టి, మూకుడులో ఆవునెయ్యి వేసి కాచి అందులో ఈ కట్టిన గుడ్డను ముంచి నడుం చుట్టూ కాపు పెడుతుంటే నడుంనొప్పి తగ్గిపోతుంది. 
 
3. వెల్లుల్లిపాయలు నాలుగు ఒక చెంచా నువ్వుల నూనెలో వేయించి, అందులో సైంధవ లవణం కలిపి తింటుంటే నడుం నొప్పి తగ్గిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క-మొత్తం కేటాయింపులు రూ. 3,24,234 కోట్లు

భార్యకు అక్రమ సంబంధాన్ని నిరూపించేందుకు డీఎన్‌ఏ టెస్టులా.. పిటిషనర్‌కు అపరాధం

యుద్ధ ట్యాంక్‌ను నడిపిన కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె.. ఇంత చిన్న వయస్సులో...

మౌలాలి- చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రైలు ఢీకొని వ్యక్తి మృతి

ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్లు చెల్లించకుంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న 'ధురంధర్-2'

ప్రైమ్ వీడియో 2026 లో 55కి పైగా కొత్త సిరీస్‌లు, సినిమాలతో ప్రకటన

Chiranjeevi: ఎన్టీఆర్ అంటే..N నాట్యం, T తాళం, R రాగం… కళల సమ్మేళనం

అదరగొడుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ... ఉప్పొంగిపోతున్న ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్ తో సినిమా మా కల, పెద్ద హిట్ అవ్వడం డబుల్ బొనాంజా : నవీన్ యెర్నేని

తర్వాతి కథనం
Show comments