Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాజ్... మర్దన... సర్వాంగాలకు పుష్టి

Webdunia
శనివారం, 26 మార్చి 2016 (20:42 IST)
శరీరానికి మర్దన చేయడం వల్ల ఆరోగ్యపరంగా కలిగే మేలు చాలా ఉంటుంది. ప్రతిరోజూ శరీరానికి నూనెతో మర్దన గావించి, తరువాత స్నానము చేయటం చాలా మంచిది. దీనివలన సర్వాంగాలకు పుష్ఠి కలుగుతుంది. ఆవనూనె, గంధపు చెక్కల నుండి తీసిన నూనె, సుగంధ ద్రవ్యముల నుండి తీసిన నూనెలు, పుష్పముల నుండి లభించే నూనెలను అభ్యంగనానికి ఉపయోగించవచ్చు. 
 
ప్రతిరోజు చెవులలో కొద్దిగా తైలపు చుక్కలు వేసుకోవడం వలన, చెవులలోని మాలిన్యములు తొలగిపోతాయి. శబ్ధగ్రహణము బాగుంటుంది. చెవిపోటు, ఇతర సమస్యలు, వ్యాధులు రాకుండా ఉంటాయి. 
 
ప్రతిరోజూ పాదములకు తైలముతో మర్దన చేయుడం వల్ల పాదాలలో బలము వృద్ధిచెందుతుంది. మొద్దుబారిన పాదాలు స్పర్శాజ్ఞానములను సంతరించుకుంటాయి. పాదముల మీద పగుళ్ళను పోగొడతాయి. దీనివలన నేత్రములకు కూడా చలువచేస్తుంది. కళ్ళు ప్రకాశవంతమవుతాయి. సుఖనిద్ర కలుగుతుంది. 
 
శిరస్సు మీద నూనె మర్దనచేయుట వలన మెదడు శక్తివంతమవుతుంది. కళ్ళు, చెవులు, దంతములకు ఎటువంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. శరీరాభ్యంగనము వలన తైలము రోమకూపములలో నుండి లోనికి ప్రవేశించి నరములు, రక్తనాళములలో ఎంతో చురకుదనాన్ని కలిగిస్తుంది. ధాతువులను వృద్ధిచేస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Covid Panic: బెంగళూరులో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు- మార్గదర్శకాలను పాటించాల్సిందే

COVID: హైదరాబాద్‌లో కోవిడ్-19 కేసు- డాక్టర్‌కు కరోనా.. ఇప్పుడెలా వున్నారంటే?

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

Show comments