Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిగా కూర్చున్నారో అంతే సంగతులు.. ఐదు నిమిషాలైనా లేచి?

కార్యాలయాల్లో, ఇళ్ళల్లో ఎక్కువ గంటలు కూర్చునే వారి సంఖ్య పెరిగిపోతోంది. తద్వారా క్యాన్సర్ ముప్పు వుందని ఇప్పటికే అధ్యయనాలు తేల్చాయి. రెండు గంటలకంటే ఎక్కువ సమయం కూర్చొని ఉంటే 8 శాతం కోలోన్ క్యాన్సర్, 1

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2017 (13:35 IST)
కార్యాలయాల్లో, ఇళ్ళల్లో ఎక్కువ గంటలు కూర్చునే వారి సంఖ్య పెరిగిపోతోంది. తద్వారా క్యాన్సర్ ముప్పు వుందని ఇప్పటికే అధ్యయనాలు తేల్చాయి. రెండు గంటలకంటే ఎక్కువ సమయం కూర్చొని ఉంటే 8 శాతం కోలోన్ క్యాన్సర్, 10 శాతం ఎండోమెట్రియల్ క్యాన్సర్, 6శాతం లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. గంటల సేపు కూర్చోవడం.. టీవీలు చూస్తూ జంక్‌ఫుడ్స్ లాగించేయడం ప్రమాదానికి దారితీస్తాయని వైద్యులు అంటున్నారు. 
 
అతిగా కూర్చోవడం అనారోగ్య సమస్యలను కొనితెచ్చి పెడుతుంది. అందుకే కనీసం గంటకోసారైనా ఐదు నిమిషాలపాటు లేచి కాస్త అటూఇటూ నడవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కనీసం పదినిమిషాలపాటు నడిచేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా ఫోను మాట్లాడేటప్పుడు నిల్చునో, నడుస్తూనో మాట్లాడండి. 
 
వీలైనంత వరకు నిల్చుని పనిచేసేందుకు అలవాటు పడండి. టీవీలో రెండున్నరగంటలసేపు సినిమా చూస్తుంటే కనీసం ఓ అర్ధగంటైనా నిల్చోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ చేస్తే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

Covid Alert: కేరళలో JN.1 వేరియంట్ ప్రభావం.. ఆరువేలకు పెరిగిన కేసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments