Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తంలో కలిసిపోయిన క్రొవ్వును కరిగించడం ఎంత సుళువో తెలుసా?

మనం చాలావరకు వెల్లుల్లి, నిమ్మరసాలను వంటల్లో మసాలా కోసమో... లేకుంటే మంచి రుచి వచ్చేందుకు మాత్రమే వాడుతుంటాం. కానీ ఈ రెండు కలిపితే శరీరానికి గొప్ప ఫలితాలు వస్తాయని చాలామందికి తెలియదు. రక్తనాళాల్లో ఎక్కువగా పేరుకు పోయిన కొలెస్ట్రాల్ కరిగించేందుకు ఫార్మ

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (19:21 IST)
మనం చాలావరకు వెల్లుల్లి, నిమ్మరసాలను వంటల్లో మసాలా కోసమో... లేకుంటే మంచి రుచి వచ్చేందుకు మాత్రమే వాడుతుంటాం. కానీ ఈ రెండు కలిపితే శరీరానికి గొప్ప ఫలితాలు వస్తాయని చాలామందికి తెలియదు. రక్తనాళాల్లో ఎక్కువగా పేరుకు పోయిన కొలెస్ట్రాల్ కరిగించేందుకు ఫార్మా కంపెనీలు తయారుచేసే మందుల్లో ఉండే పదార్థాలు కూడా ఇవే. రసాయనిక చర్యతో తయారైన మందులు ఎందుకు వాడాలి. సహజసిద్ధంగా ఆ రెండింటిని కలుపుకుని మనమే తాగితే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దీంతో సరఫరా మెరుగవుతుంది. 
 
గుండె సంబంధిత సమస్యల నుంచి దీర్ఘాయుష్షు పొందవచ్చు. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తాగితే గుండెనొప్పి రాదు. ఆ తరువాత జబ్బులే రావు. అధిక బరువు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తాగితే చాలా మంచిది. 30 వెల్లుల్లి రెబ్బలు, ఆరు నిమ్మకాయలు తీసుకోవాలి. నిమ్మకాయలను కోసి రసం తీయాలి. వెల్లుల్లి పొట్టు తీసేసి ముక్కులుగా కోయాలి. తరువాత కొద్దిగా నీళ్ళు పోసుకుని రెండింటిని మిక్సీ పట్టాలి. మిక్సీ తరువాత రెండు లీటర్ల నీటిని కలపాలి. తరువాత వచ్చే మిశ్రమాన్ని ఐదు నుంచి పది నిమిషాలు వేడి చేయాలి.
 
ఆ తరువాత వడగట్టి గాజు సీసాలో ఉంచి ఫ్రిజ్‌లో ఉంచాలి. ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని 50 ఎం.ఎల్. చొప్పున ఉదయం పరగడుపున తాగాలి. ఇలా మూడు వారాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. తిరిగి వారం రోజులు గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ మూడువారాలు తాగాలి. ఇలా ప్రతి ఆరు నెలలు చేస్తే, గుండెకు రక్తాన్ని పంపిణీ  చేసే నాళాల్లో క్రొవ్వు కరిగిపోతుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments