Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోరువెచ్చటి నీళ్లలో రెండు చెంచాల తేనె కలుపుకుని తాగితే?

Webdunia
సోమవారం, 22 అక్టోబరు 2018 (17:38 IST)
తేనె విభిన్న ప్రయోజనాలను కలిగి ఉంటుంది. గాయాలు, పుళ్లు మానడానికి ఉపకరిస్తుంది. ఎందుకంటే దీనిలో గాయాలను మాన్చే గుణం ఉన్నది. దీని పీహెచ్ 3.2 నుంచి 4.5 దాకా ఉండటం వల్ల శరీరంలోకి వచ్చిన బ్యాక్టీరియాను అదుపు చేస్తుంది.
 
కంటికి అవసరమైన విటమిన్ "ఎ"ను శరీరం తీసుకునేందుకు సాయపడుతుంది. ఇది శరీరపు శక్తిని ఇనుమడింపజేస్తుంది. మానసిక ప్రశాంతతను, సహజమైన నిద్రను ఇస్తుంది. తేనె కలిపిన నీటితో పుక్కిలిస్తే నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు తగ్గుతాయి. 
 
మరికొన్ని చిట్కాలు...
రోజూ పావు గ్లాసు గోరు వెచ్చటి నీళ్లలో రెండు చెంచాల తేనె కలుపుకుని తాగితే ఒళ్లు తగ్గుతుంది. రాత్రిళ్లు తేనె కలుపుకున్న పాలు తాగితే చక్కటి నిద్ర వస్తుంది. 
 
నిమ్మకాయ రసంలో తేనె కలుపుకుని తీసుకుంటే కడుపు ఉబ్బరం, నొప్పి తగ్గుతుంది. వేడి నీటిలో తేనె, నిమ్మరసం పది చుక్కలు వేసుకుని తాగితే ఆయాసం తగ్గుతుంది. తేనె, తులసి ఆకురసం తీసుకుంటే.. దగ్గు, శ్లేష్మం తగ్గుతుంది. 
 
తేనెలో కొంచెం మిరియాలపొడి కలుపుకుని తీసుకుంటే జలుబు తగ్గుతుంది. రెండు చెంచాల తేనెలో కోడిగుడ్డులోని తెల్లని సొన, కొంచెం శనగపిండి కలుపుకుని ముఖానికి మర్దన చేసుకుంటే చర్మపు కాంతి పెరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

తర్వాతి కథనం
Show comments