Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదం నానబెట్టి ఆరగిస్తే కలిగే ఫలితాలేంటి?

బాదం తింటే మంచిదనీ వీటిల్లో విటమిన్‌-ఇ, పీచు, ఒమేగా-3- ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లూ సమృద్ధిగా ఉంటాయనీ అందరికీ తెలుసు. అయితే బాదంపప్పుల్ని నానబెట్టుకునే ఆరగిస్తే ఎన్నో ఆరోగ్య ఫలితాలు కలుగుతాయట.

Webdunia
బుధవారం, 17 మే 2017 (11:13 IST)
బాదం తింటే మంచిదనీ వీటిల్లో విటమిన్‌-ఇ, పీచు, ఒమేగా-3- ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లూ సమృద్ధిగా ఉంటాయనీ అందరికీ తెలుసు. అయితే బాదంపప్పుల్ని నానబెట్టుకునే ఆరగిస్తే ఎన్నో ఆరోగ్య ఫలితాలు కలుగుతాయట. ఎందుకంటే బాదం తొక్కలో ఉండే టానిన్లు అందులోని పోషకాలు శరీరంలో ఇంకకుండా అడ్డుకుంటాయి. అదే నానబెట్టి ఆ తొక్కను తీసేసి తినడంవల్ల అందులోని పోషకాలన్నీ పూర్తిగా ఒంటపడతాయి. అందుకే బాదంపప్పుల్ని కనీసం 8 గంటలైనా నానబెట్టి ఆరగిస్తే ఎంతో ఉత్తమం అంటారు. 
 
నానబెట్టిన బాదం పప్పులు జీర్ణశక్తికి అవసరమైన ఎంజైమ్‌ల విడుదలను వేగవంతం చేస్తాయి. ముఖ్యంగా లైపేజ్‌ అనే ఎంజైమ్‌ విడుదల వల్ల కొవ్వులు త్వరగా జీర్ణమవుతాయి.
 
వీటిల్లోని మోనో అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు ఆకలిని తగ్గించి పొట్టనిండిన అనుభూతిని కలిగిస్తాయి. దాంతో బరువు నియంత్రణకు తోడ్పడతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా హృదయపనితీరుకీ సాయపడతాయి.
 
వీటిల్లోని విటమిన్‌-ఈ ఫ్రీరాడికల్స్‌ నుంచి చర్మకణాలను రక్షించడం ద్వారా వృద్ధాప్యాన్ని అడ్డుకుంటుంది.
 
నానబెట్టిన బాదంలో విటమిన్‌ బి17 సమృద్ధిగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌ కణాలతోనూ పోరాడుతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు కంతుల పెరుగుదలనూ అడ్డుకుంటాయి, బీపీనీ తగ్గిస్తాయి. ఫోలిక్‌ఆమ్లం పుట్టబోయే శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

భూమిపై ఆక్సిజన్ తగ్గిపోతుంది.. మానవుల మనుగడ సాధ్యం కాదు.. జపాన్ పరిశోధకులు

Belagavi: 14 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ యువకులు కిడ్నాప్ చేసి, ఫామ్‌హౌస్‌లో..?

Bhargavastra, శత్రు దేశాల డ్రోన్ల గుంపును చిటికెలో చిదిమేసే భార్గవాస్త్ర

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments