Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీర్ణ సమస్యలను నయం చేసే అరటిపండు

Webdunia
ఆదివారం, 2 డిశెంబరు 2018 (13:10 IST)
'పేదవాడి ఆపిల్‌'గా పేరుగాంచిన అరటిపండుతో జీర్ణసంబంధమైన సమస్యలు పరిష్కారమవుతాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో 75 శాతం మేరకు నీరు, గుజ్జు రూపంలో ఉంటుందని, పండే కొద్దీ గుజ్జు మరింత మెత్తగా మారుతుంది. ఇందులో కార్బోహైడ్రెట్స్ మన శరీరానికి శక్తినిస్తాయి. 
 
పీచు పదార్థం, మెగ్నీషియమ్ పుష్కలంగా వున్నందున మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. రాత్రిపూట అరటిపండు తింటే నిద్ర బాగా పడుతుందని చెబుతారు. పెద్దపేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం. 
 
డైటింగ్ చేస్తున్న వారు ఒక పూట భోజనం లేదా టిఫిన్ మానేసి రెండు, మూడు అరటి పండ్లు తింటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. జీర్ణ సంబంధమైన సమస్యలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బుపడిన వాళ్లు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు. 
 
అంతేకాకుండా, అరటిపండు మంచి పోషక విలువలను కలిగివుంటుంది. యేడాది పొడవునా పుష్కలంగా లభిస్తుంది. ఇది త్వరగా జీర్ణమైపోయి శక్తిని ఇస్తుంది. సంపూర్ణాహారమైనందున ఎదుగుతున్న పిల్లలకు ఇది చాలా మంచిది. చాలామంది భోజనం చేశాక అరటి పండును విధిగా తింటారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments