భోజనానికి ఎంత సమయం కేటాయిస్తున్నారు...? 5 నిమిషాల్లో అయిపోతుందా?

అన్నం తినేటపుడు కూడా ఇప్పుడు టెన్షన్ మామూలైపోయింది. గబగబా నాలుగు ముద్దలు లాగించేసి వెళ్లిపోయేవారు చాలామంది ఉన్నారు. ఇలా తినేవారికి ఆరోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడిలో భోజనాన్ని, ఏదో అయిందిలే అన్నట్లు కాకుండా.. నెమ్

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (18:51 IST)
అన్నం తినేటపుడు కూడా ఇప్పుడు టెన్షన్ మామూలైపోయింది. గబగబా నాలుగు ముద్దలు లాగించేసి వెళ్లిపోయేవారు చాలామంది ఉన్నారు. ఇలా తినేవారికి ఆరోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పని ఒత్తిడిలో భోజనాన్ని, ఏదో అయిందిలే అన్నట్లు కాకుండా.. నెమ్మదిగా, సరైనా సమయానికి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారు. 
 
ఒక వేళ అల్పాహారం తీసుకోవడం కుదరకుంటే, రకరకాల పండ్లు, శాండ్ విచ్ వంటివి తీసుకోవచ్చు. కడుపును ఏ మాత్రం ఖాళీగా ఉంచకుండా బాదం పప్పులు వంటివి తింటే తక్షణ శక్తి అందుతుంది. అలాగే నాలుగు ముద్దలు గబగబా లాగించేసి మధ్యాహ్న భోజనం అయిపించకండి. వేగంగా తింటే జీర్ణక్రియలు దెబ్బతింటాయి. సరిగ్గా నమలకపోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం కాదు. తద్వారా పోషకాలు కూడా సమయానికి అందవు. 
 
వేగంగా తినేస్తే, ఆపై శరీరంపై ఒత్తిడి పడుతుంది. భోజనానికి కనీసం 20 నిమిషాలు కేటాయిస్తే మంచిది. ఇదే సమయంలో అటు ఎక్కువ, ఇటు తక్కువ కాకుండా ఆహారం తీసుకోవాలి. ఏది అందుబాటులో ఉంటే దాన్ని తింటే, షుగర్, స్థూలకాయం సమస్యలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతిలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, బాబుతో భేటీ

ఏపీలో బిల్ గేట్స్.. ఘన స్వాగతం పలికిన నారా లోకేష్- సచివాలయంలో ఏపీ సీఎంతో భేటీ..

ఉత్తర కొరియాలో వారసత్వ పోరు.. కిమ్ కుమార్తెతో పోటీ పడుతున్న సోదరి

Solar Eclipse 2026: ఫిబ్రవరి 17న వలయాకార సూర్యగ్రహణం

పాత సిమ్ కార్డులు, ఈ వేస్ట్ నుంచి రూ.27లక్షల విలువైన బంగారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: ఎగస్ పార్టీ కి దూల తీసి దూపం ఏసేవాడే పెద్ది !

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

తర్వాతి కథనం
Show comments