Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నీళ్లే కదా... తాగితే ఎంత... తాగకపోతే ఏంటి?

ఆ నీళ్లే కాదా... తాగితే ఎంత... తాగకపోతే ఏంటి అని చాలామంది అనుకుంటారు. శరీరంలో ఎక్కువశాతం నీరే ఉంటుంది. ఈ నీరే ప్రాణాధారం. శరీరానికి తగినంత నీరు అందివ్వడంతో ఆరోగ్యంగా ఉంటారు. నీరు సేవించడం వలన శరీరంలోని విషపూరితమైన పదార్థాలు బయటకు విసర్జించడమే కాకుండా

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2016 (18:32 IST)
ఆ నీళ్లే కాదా... తాగితే ఎంత... తాగకపోతే ఏంటి అని చాలామంది అనుకుంటారు. శరీరంలో ఎక్కువశాతం నీరే ఉంటుంది. ఈ నీరే ప్రాణాధారం. శరీరానికి తగినంత నీరు అందివ్వడంతో ఆరోగ్యంగా ఉంటారు. నీరు సేవించడం వలన శరీరంలోని విషపూరితమైన పదార్థాలు బయటకు విసర్జించడమే కాకుండా చర్మం, ఉదరం, మూత్రపిండాలలోనున్న పలురకాల విషపదార్థాలు బయటకు విసర్జించబడతాయి. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు రకరకాల జబ్బులు చోటుచేసుకుంటాయి. నీరు తక్కువగా తీసుకోవడంతో డీహైడ్రేషన్ సమస్య ఉత్పన్నమౌతుంది. 
 
శరీరంలో చేరుకునే రకరకాల జబ్బులను నీరు పారద్రోలుతుంది. కాబట్టి శరీరానికి తగినంత నీరు అందిస్తుండాలి. శరీర బరువును నియంత్రించేందుకు నీరు ఓ దివ్యౌషధంలా ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తొలగించేసే గుణం ఇందులో ఉంది. నీటిలో క్యాలరీలు, కొవ్వు, చక్కెర, కార్బోహైడ్రేట్లుండవు. నీటిని సేవించడం వలన ఎక్కువ క్యాలరీలు కలిగిన సోడా, డ్రింక్స్, మద్యం, ఇతర జ్యూస్‌లను త్రాగాలనిపించదు. 
 
శరీరంలో తగిన మోతాదులో నీరు ఉంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. నీటితో శరీరంలో శక్తి వస్తుంది. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు అలసట కలుగుతుంది. దీంతో శరీరంలో శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. తరచూ గొంతు ఎండిపోవడం, కొందరిలో కళ్ళు తిప్పడం లాంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. అలసట కారణంగా కొందరిలో బలహీనత ఏర్పడుతుంది. 
 
ఆరోగ్యకమైన చర్మ కోసం నీటిని ఎక్కువగా సేవించాలంటున్నారు వైద్యులు. తగిన మోతాదులో నీరు తీసుకుంటుంటే చర్మంలో నిగారింపు కనపడుతుంది. ఇది ఒక్కరోజులోనే జరగదంటున్నారు వైద్యులు. దీనికి నిత్యం నీటిని సేవిస్తుండాలి. అప్పుడే అనారోగ్యంబారిన పడకుండా ఉంటారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments