మధుమేహ వ్యాధిగ్రస్థులు బోర్న్‌విటా, కాంప్లాన్ తీసుకోకూడదట..

మధుమేహ వ్యాధిగ్రస్థులు తేనె, గ్లూకోజ్‌, బెల్లం, కేకులు, పేస్ట్రీలు, స్వీట్స్‌, లేత కొబ్బరినీరు, కొబ్బరి చట్నీలు, చల్లనీ పానియాలు, ఆల్కహాల్‌ తీసుకోకూడదు. అలాగే బోర్న్‌విటా, కాంప్లాన్‌, ఎండిన ద్రాక్ష, అ

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2017 (16:21 IST)
మధుమేహ వ్యాధిగ్రస్థులు తేనె, గ్లూకోజ్‌, బెల్లం, కేకులు, పేస్ట్రీలు, స్వీట్స్‌, లేత కొబ్బరినీరు, కొబ్బరి చట్నీలు, చల్లనీ పానియాలు, ఆల్కహాల్‌ తీసుకోకూడదు. అలాగే బోర్న్‌విటా, కాంప్లాన్‌, ఎండిన ద్రాక్ష, అరటి, మామిడి, పనస, సపోటా, సీతాఫలం, ద్రాక్ష, ఖర్జూరం, అత్తిపండ్లు లాంటివి తీసుకోకూడదు. ఎందుకంటే వీటిలో కార్బొ హైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్థులకు మంచివి కావని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
మధ్యాహ్నం భోజనంలో రెండు చపాతీలు, ఒక కప్పు గంజి తీసేసిన అన్నం తీసుకోవాలి. మధ్యాహ్నం ఆహారంలో ఒక కప్పు పెరుగు, ఆకుకూరలు, సలాడ్ ఓ కప్పు వుండేలా చూసుకోవాలి. ఉదయం అరకప్పు పండ్ల ముక్కలు తీసుకోవాలి. పలుచటి మజ్జిగ లేదా చక్కెర లేని నిమ్మకాయ రసాన్ని సేవించవచ్చు.
 
డయాబెటిస్ పేషెంట్లు గోధుమ రవ్వతో చేసిన ఉప్మా ఒక కప్పు, అరకప్పు మొలకెత్తిన విత్తనాలు, 100 మిల్లీలీటర్ల చక్కెరలేని పాలను అల్పాహారంగా తీసుకోవాలి. బ్లాక్ బెర్రీ లేదా నేరేడు పండ్లు రోజుకు అరకప్పు తీసుకోవచ్చు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగివుంటాయి. డయాబెటిస్‌తో బాధపడేవారు నెయ్యి, వెన్న, కొబ్బరినూనె, పామాయిల్‌, వనస్పతిని వాడిన ఆహారం తీసుకోకూడదు. సన్‌ఫ్లవర్‌ నూనె, మొక్కజొన్న నూనె మితంగా వాడాలి. కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన.. మొట్టమొదటి 133-క్విట్ క్వాంటం కంప్యూటర్‌ను..?

పవన్ సౌలభ్యాన్ని బట్టి వేషం మారుస్తారు.. క్షమాపణలు చెప్పాల్సిందే.. రోజా

కేసీఆర్‌కు జాతిపిత బిరుదు.. ఎప్పటికీ ఆమోదించను - ప్రొఫెసర్ కోదండరామ్

రోడ్డు యాక్సిడెంట్ చేసినవాడిని ఎందుకు జైలులో వెయ్యరు?

తెలంగాణలో ప్రచారానికి పవన్ కల్యాణ్ రారట.. కారణం ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tharun Bhascker: గాయపడ్డ సింహం గా తరుణ్ భాస్కర్ ఏమి చేశాడు !

నాగార్జున వాయిస్ ఓవర్ తో అనిష్ చిత్రం ఇట్లు అర్జున

టెలివిజన్‌ టీఆర్‌పీతో రికార్డులను బద్దలు కొట్టిన తేజ సజ్జా మిరాయ్

Yash: టాక్సిక్‌ తెలుగు రాష్ట్రాల హ‌క్కుల‌ను 120 కోట్ల‌కు సొంతం చేసుకున్న దిల్ రాజు

Unni Mukundan: హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మోదీ బయోపిక్ మా వందే

తర్వాతి కథనం
Show comments