Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నంపై ఉండే అపోహలు...

దేశంలో 70 నుంచి 80 శాతం మంది ప్రజలు వరి బియ్యంతో తయారు చేసే అన్నమే ఆరగిస్తుంటారు. ఈ అన్నంలోకి తమకు ఇష్టమైన రుచికరమైన కూరలను తయారు చేసుకుని అందులో కలుపుకుని ఆరగిస్తుంటారు. అయితే అన్నం తినడంపై చాలా మంది

Webdunia
గురువారం, 5 జులై 2018 (09:41 IST)
దేశంలో 70 నుంచి 80 శాతం మంది ప్రజలు వరి బియ్యంతో తయారు చేసే అన్నమే ఆరగిస్తుంటారు. ఈ అన్నంలోకి తమకు ఇష్టమైన రుచికరమైన కూరలను తయారు చేసుకుని అందులో కలుపుకుని ఆరగిస్తుంటారు. అయితే అన్నం తినడంపై చాలా మందికి పలు అపోహలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
* సాధారణంగా రాత్రిపూట చాలా మంది అన్నంకు బదులు చపాతీ, టిఫన్ వంటివి తీసుకుంటుంటారు. వీటికంటే అన్నం ఆరగించడమే ఉత్తమమని వైద్యులు చెపుతున్నారు. ఎందుకంటే.. అన్నం తినడం వల్ల చక్కగా నిద్ర పడుతుంది. దీంతో లెప్టిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. 
 
* మన శరీరంలో శక్తిని బాగా ఖర్చు చేస్తుంది. కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. దీంతోపాటు ఆకలి వేయకుండా ఉంచుతుంది. కనుక రాత్రి పూట నిర్భయంగా అన్నం తినవచ్చు.  
 
* ముఖ్యంగా దేశంలో చక్కెర వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. వీరంతా రాత్రిళ్లు అన్నం మానేసి చపాతీలు, వివిధ రకాల రొట్టెలు ఆరగిస్తుంటారు. నిజానికి మధుమేహం ఉన్న వారు నిర్భయంగా అన్నం తినవచ్చు. 
 
* తక్కువ మోతాదులో అన్నం తినడంతోపాటు దాంట్లో పప్పులు, కూరగాయలు, నెయ్యి వంటి ఆహారాలను చేర్చుకుంటే భోజనం చేసిన వెంటనే షుగర్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఇలా డయాబెటిస్ ఉన్నవారు కూడా అన్నంతిన్నట్టయితే చక్కెర నిల్వల స్థాయిని నియంత్రణలో ఉంచుతాయని చెపుతున్నారు. 
 
* అన్నం తినడం వల్ల శరీరంలో కొవ్వు చేరదు. నిత్యం మనం తినే జంక్‌ఫుడ్, నూనె పదార్థాలు, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్లే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. దీన్ని నివారించాలంటే అన్నం ఆరగించడమే ఉత్తమం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలి నుంచి డీవీఆర్ స్వాధీనం

రాజా రఘువంశీ హత్యకు మూడు సార్లు విఫలం.. నాలుగోసారి సక్సెస్

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

India: దేశంలో ఏడువేల యాక్టివ్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో కేసులెన్ని?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

తర్వాతి కథనం
Show comments