Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ ఫోన్ రేడియేషన్ పుణ్యంతో పిచ్చుకలు మాయం.. కాపాడండి.. మహాప్రభో..!

ఆధునీకరణ పేరుతో ప్రకృతి సంపద కనుమరుగువుతూ వస్తున్నాయి. నగరాభివృద్ధి కోసం భవనాల సంఖ్య పెరిగిపోతున్న వేళ.. వృక్షాలు తగ్గిపోతున్నాయి. దీంతో వర్షాలు సైతం కురవట్లేదు. క్రమ క్రమంగా ప్రకృతి మానవాళికి దూరమవుతున్న తరుణంలో వాటిని ఆధారంగా చేసుకుని జీవించే పక్షు

Webdunia
సోమవారం, 20 మార్చి 2017 (15:25 IST)
ఆధునీకరణ పేరుతో ప్రకృతి సంపద కనుమరుగువుతూ వస్తున్నాయి. నగరాభివృద్ధి కోసం భవనాల సంఖ్య పెరిగిపోతున్న వేళ.. వృక్షాలు తగ్గిపోతున్నాయి. దీంతో వర్షాలు సైతం కురవట్లేదు. క్రమ క్రమంగా ప్రకృతి మానవాళికి దూరమవుతున్న తరుణంలో వాటిని ఆధారంగా చేసుకుని జీవించే పక్షుల సంఖ్య కూడా తగ్గిపోతూ వస్తోంది. తాజాగా సెల్ ఫోన్ల పుణ్యంతో పిచ్చుకలు మాయమైపోతున్నాయి. 
 
చిన్న చిన్న రెక్కలతో టపటపలాడిస్తూ నిత్యం మనల్ని పలకరించే జీవులు ప్రస్తుతం కనుమరుగు అవుతున్నాయి. జీవవైవిధ్యానికి ప్రతీకలుగా ఉన్న ఈ పక్షులు హైటెక్ సిటీగా పేరున్న హైదరాబాదులో బాగా తగ్గిపోయాయి. నేడు ''వరల్డ్ స్పారో డే'' ఈ రోజును పురస్కరించుకుని పిచ్చుకల సంఖ్యను పెంచేందుకు మనవంతు సాయం చేయాలని ఆశిద్దాం..
 
ఫ్లాట్ కల్చర్, సెల్ ఫోన్ల రేడియేషన్ కారణంగా పిచ్చుల ఉనికి కనుమరుగైంది. రాష్ట్రవ్యాప్తంగా 450 పక్షి జాతులు మనుగడలో ఉంటే హైదరాబాద్‌లో ఊరపిచ్చుకలతోపాటు 40 రకాల పక్షులే ఉన్నాయి.
 
అదే దేశ రాజధాని ఢిల్లీలో పిచ్చుకల ఆనవాళ్లు ఏమాత్రం కనిపించడం లేదు. ఈ పక్షి ఢిల్లీ రాష్ట్ర పక్షిగా గుర్తింపు పొందినప్పటికీ.. వాతావరణ కాలుష్యం, సెల్‌ఫోన్ రేడియేషన్ కారణంగా పిచ్చుకల సంఖ్య తగ్గిపోయింది. జనాభా పెరిగిపోవడం.. వృక్ష సంపద లేకపోవడం కారణంగా చిన్ని జీవాలైన పిచ్చుకలు కనిపించట్లేదు. కిటికీలు, వెంటిలేటర్లపై కీచ్ కీచ్‌మంటూ అరుస్తూ పలకరించే పిచ్చుకలు ప్రస్తుతం ఏమయ్యాయోనని మూగజీవాల ప్రేమికులు వాపోతున్నారు. చెట్లను నరికేయడం ద్వారా చిట్టి పక్షులు నివాసం కోల్పోతున్నాయి. ఇంకా వాతావరణ కాలుష్యమే కాకుండా శబ్ధ కాలుష్యంతో చిట్టి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని పరిశోధనలో వెల్లడి అయ్యింది. 
 
అందుకే చిట్టి చిట్టి ప్రాణాలను కాపాడుకోవాలంటే.. బాల్కనీల్లో, ఇంటి నీడల్లో కనిపించే పక్షుల కోసం గూళ్లను ఏర్పాటు చేయండి. చిన్న నీటి తొట్టెల్లో నీటిలో అందుబాటులో ఉంచాలి. కాలనీల్లో, ఖాళీస్థలాల్లో పక్షుల కోసం ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేయాలి. అలాగే డాబాల మీద చిన్న చిన్న మొక్కలను పెంచాలని పరిశోధకులు చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చిత్తూరు జిల్లాలో హెచ్‌సిసిబి సీఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్

Amaravati: ఆగస్టు 15న ప్రారంభం కానున్న అమరావతి సీఆర్డీఏ కార్యాలయం

గచ్చిబౌలిలో తాటిచెట్టుపై పడిన పిడుగు, పిడుగులు పడుతున్నప్పుడు ఏం చేయాలి? ( video)

AP: ఒడిశా నుంచి కేరళకు బొలెరోలో గంజాయి.. పట్టుకున్న ఏపీ పోలీసులు

ప్రజ్వల్ రేవన్నకు చనిపోయేంత వరకు జైలు - నెలకు 2 సార్లు మటన్ - చికెన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments