రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

ఠాగూర్
బుధవారం, 1 జనవరి 2025 (16:59 IST)
చాలామంది ఐటీ ఉద్యోగులు గంటల కొద్దీ కుర్చీలకు అతుక్కునిపోయి పని చేస్తుంటారు. ఇలాంటి వారికి ప్రాణముప్పు పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిశ్చలమైన లైఫ్ స్టైల్ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామం చేయాలని సలహా ఇస్తున్నారు. అయితే, రోజుకు పదిన్నర గంటలకు పైగా కూర్చునే వారిని వ్యాయామం కూడా కాపాడలేదని తాజా అధ్యయనం తేల్చి చెప్పింది.
 
రోజులో దాదాపు సగం గంటలు కూర్చుంటే వ్యాయామం చేసినా ఎందుకూ కొరగాకుండా పోతుందని ఎంఐటీ, హార్వర్డ్ యూనివర్సిటీ తాజా అధ్యయనం పేర్కొంది. మిగతా వారితో పోలిస్తే రోజులో 10.6 గంటల కంటే ఎక్కువ సేపు కూర్చునే వారిలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువని తేలింది. వారానికి సిఫార్సు చేసిన 150 నిమిషాల వ్యాయామం చేసినప్పటికీ ఇటువంటి వారిలో ఎలాంటి ప్రభావం ఉండదని తేల్చి చెప్పింది.
 
రోజులో పదిన్నర గంటలకుపైగా కూర్చునే వారిలో గుండె వైఫల్యం కారణంగా 15 శాతం, హృద్రోగాలతో మరణించే అవకాశం 33 శాతం ఎక్కువని పేర్కొంది. వ్యాయామం అలవాటు లేని వారిలో ఈ ముప్పు మరింత ఎక్కువని అధ్యయనం తెలిపింది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన ఫ్లాగ్లిప్ జర్నల్ జేఏసీసీలో ఈ అధ్యయనం ప్రచురితమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏనుగుతో సెల్ఫీ కోసం ప్రయత్నం, తొక్కి చంపేసింది (video)

కస్టడీ కేసు: ఆర్ఆర్ఆర్‌‌ను సస్పెండ్ చేయండి.. సునీల్ కుమార్ ఎక్స్‌లో కామెంట్లు

Ranga Reddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా అగ్రస్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా.. ఎలా?

తెలంగాణ ఎన్నికల్లోనూ జగన్‌ను ఓడించిన చంద్రబాబు.. ఎలాగంటే?

Baba Vanga: 2026లో భూమిపైకి గ్రహాంతరవాసులు వస్తారట.. ఏఐతో ముప్పు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

Jin: జిన్ లాంటి కొత్త ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా : నిఖిల్ ఎం. గౌడ

SS Rajamouli: ఎస్‌ఎస్ రాజమౌళి పై జేమ్స్ కామెరాన్ కామెంట్ వైరల్

తర్వాతి కథనం
Show comments