తాగేముందు పాలను ఎందుకు వేడిచేయాలి?

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (18:42 IST)
మనందరికీ సంపూర్ణ పోషణను అందించే ఆహారాలలో మొదటి స్థానం పాలకే దక్కుతుంది. వీటిని రోజూ తాగడం వల్ల శరీరానికి బలంతోపాటు, కాల్షియం కూడా పుష్కలంగా అందుతుంది. పిల్లల ఎదుగుదలకు పాలు ఎంతగానో దోహదపడతాయి. కానీ పాలను తాగడానికి ముందు వాటిని మరిగించాలి. అలా చేస్తే దానిలోని హానికర బ్యాక్టీరియా నశించిపోతుంది. కానీ, ప్యాకెట్లలో వచ్చిన పాలను మారగించాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. 
 
చాలా మంది ప్యాకెట్ పాలను కూడా బాగా మరిగించి తాగుతారు. దీనివల్ల పోషక విలువలు తగ్గిపోతాయి. ప్యాకెట్ పాలను కొద్దిగా వేడి చేసి తాగితే సరిపోతుంది. ప్యాకెట్ పాలను ఎందుకు మరిగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా డైరీ వాళ్లు పాలను 161.6 డిగ్రీల ఫారెన్‌హీట్ టెంప‌రేచ‌ర్‌కు మరిగించి 15 సెకన్లలో చల్లారుస్తారు. తద్వారా హానికార‌క సాల్మొనెల్లా బ్యాక్టీరియా తొల‌గిపోతుంది. 
 
ఈ ప్రక్రియను పాశ్చ‌రైజేష‌న్ అంటారు. పాశ్చ‌రైజేషన్ చేసిన పాలను మళ్లీ మరిగించాల్సిన అవసరం లేదు. కానీ చల్లగా త్రాగడం ఇష్టంలేని వారు కాస్త వేడి చేసుకుని తీసుకోవచ్చు. ఇక ప్యాకెట్ పాలు కాకుండా నేరుగా గేదెల వ్యాపారుల నుంచి పాల‌ను కొనేవారు మాత్రం ఆ పాల‌ను ఖచ్చితంగా మ‌రిగించాలి. అప్పుడు మాత్రమే సాల్మొనెల్లా బ్యాక్టీరియా నశిస్తుంది. ఆ తర్వాత పాలను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విజయ్ సీఎం అయితే నాకు అసూయ ఎందుకు, అతడు నాకంటే 25 ఏళ్లు చిన్నవాడు: రజినీకాంత్

ఏపీలోని పలు మండలాలకు తీవ్ర వడగాలుల హెచ్చరికలు జారీ

61 మంది మహిళలపై లైంగిక వేధింపులు.. భారత సంతతి వ్యక్తికి 14 ఏళ్ల జైలు శిక్ష

బక్రీద్ పండుగ - ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షల రీ-షెడ్యూల్

భూమి కోసం అక్కను కత్తితో పొడిచి చంపేసిన తమ్ముడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

Jonnavithula: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో వస్తున్న మూవీ లలిత

Mega158: మెగా158 కోసం జిమ్ వర్కౌట్‌ను పంచుకున్న చిరంజీవి

Manchu Manoj: డేవిడ్ రెడ్డి టీజర్ తో రా కింగ్ ట్యాగ్ తో వస్తున్న మంచు మనోజ్

క్రికెటర్ తిలక్ వర్మతో శ్రీలీల రిలేషన్... సోషల్ మీడియాలో పుకార్లు

తర్వాతి కథనం
Show comments