తాగేముందు పాలను ఎందుకు వేడిచేయాలి?

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (18:42 IST)
మనందరికీ సంపూర్ణ పోషణను అందించే ఆహారాలలో మొదటి స్థానం పాలకే దక్కుతుంది. వీటిని రోజూ తాగడం వల్ల శరీరానికి బలంతోపాటు, కాల్షియం కూడా పుష్కలంగా అందుతుంది. పిల్లల ఎదుగుదలకు పాలు ఎంతగానో దోహదపడతాయి. కానీ పాలను తాగడానికి ముందు వాటిని మరిగించాలి. అలా చేస్తే దానిలోని హానికర బ్యాక్టీరియా నశించిపోతుంది. కానీ, ప్యాకెట్లలో వచ్చిన పాలను మారగించాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. 
 
చాలా మంది ప్యాకెట్ పాలను కూడా బాగా మరిగించి తాగుతారు. దీనివల్ల పోషక విలువలు తగ్గిపోతాయి. ప్యాకెట్ పాలను కొద్దిగా వేడి చేసి తాగితే సరిపోతుంది. ప్యాకెట్ పాలను ఎందుకు మరిగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా డైరీ వాళ్లు పాలను 161.6 డిగ్రీల ఫారెన్‌హీట్ టెంప‌రేచ‌ర్‌కు మరిగించి 15 సెకన్లలో చల్లారుస్తారు. తద్వారా హానికార‌క సాల్మొనెల్లా బ్యాక్టీరియా తొల‌గిపోతుంది. 
 
ఈ ప్రక్రియను పాశ్చ‌రైజేష‌న్ అంటారు. పాశ్చ‌రైజేషన్ చేసిన పాలను మళ్లీ మరిగించాల్సిన అవసరం లేదు. కానీ చల్లగా త్రాగడం ఇష్టంలేని వారు కాస్త వేడి చేసుకుని తీసుకోవచ్చు. ఇక ప్యాకెట్ పాలు కాకుండా నేరుగా గేదెల వ్యాపారుల నుంచి పాల‌ను కొనేవారు మాత్రం ఆ పాల‌ను ఖచ్చితంగా మ‌రిగించాలి. అప్పుడు మాత్రమే సాల్మొనెల్లా బ్యాక్టీరియా నశిస్తుంది. ఆ తర్వాత పాలను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తీవ్రమైన డిప్రెషన్.. టవల్‌తో భార్యను హత్య చేసిన ఇస్రో రిటైర్డ్ అధికారి

రాజమండ్రి జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశా... అదొక శిక్షణా కేంద్రం : అంబటి రాంబాబు

Ambati Rambabu: రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన అంబటి రాంబాబు

Sudarshan Reddy: తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ.. సుదర్శన్ రెడ్డికి ఆ ఛాన్స్?

భోపాల్‌లో 'శుభలగ్నం' మూవీ రిపీట్ - రూ.1.5 కోట్లకు భర్తను అమ్మేసిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తండ్రి కూతురు సెంటిమెంట్ తో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్

Sri Vishnu: విష్ణు విన్యాసం స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది : శ్రీ విష్ణు

Anupama: అనుపమ పరమేశ్వరన్ తో అగ్ర నిర్మాణ సంస్థ కొత్త మూవీ ప్రకటన

INCA: ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక

Chiranjeevi: సురేఖ నా భార్య మాత్రమే కాదు, నా బలం, నా అండ, నా ప్రశాంతత : చిరంజీవి

తర్వాతి కథనం
Show comments