Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాగేముందు పాలను ఎందుకు వేడిచేయాలి?

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (18:42 IST)
మనందరికీ సంపూర్ణ పోషణను అందించే ఆహారాలలో మొదటి స్థానం పాలకే దక్కుతుంది. వీటిని రోజూ తాగడం వల్ల శరీరానికి బలంతోపాటు, కాల్షియం కూడా పుష్కలంగా అందుతుంది. పిల్లల ఎదుగుదలకు పాలు ఎంతగానో దోహదపడతాయి. కానీ పాలను తాగడానికి ముందు వాటిని మరిగించాలి. అలా చేస్తే దానిలోని హానికర బ్యాక్టీరియా నశించిపోతుంది. కానీ, ప్యాకెట్లలో వచ్చిన పాలను మారగించాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. 
 
చాలా మంది ప్యాకెట్ పాలను కూడా బాగా మరిగించి తాగుతారు. దీనివల్ల పోషక విలువలు తగ్గిపోతాయి. ప్యాకెట్ పాలను కొద్దిగా వేడి చేసి తాగితే సరిపోతుంది. ప్యాకెట్ పాలను ఎందుకు మరిగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా డైరీ వాళ్లు పాలను 161.6 డిగ్రీల ఫారెన్‌హీట్ టెంప‌రేచ‌ర్‌కు మరిగించి 15 సెకన్లలో చల్లారుస్తారు. తద్వారా హానికార‌క సాల్మొనెల్లా బ్యాక్టీరియా తొల‌గిపోతుంది. 
 
ఈ ప్రక్రియను పాశ్చ‌రైజేష‌న్ అంటారు. పాశ్చ‌రైజేషన్ చేసిన పాలను మళ్లీ మరిగించాల్సిన అవసరం లేదు. కానీ చల్లగా త్రాగడం ఇష్టంలేని వారు కాస్త వేడి చేసుకుని తీసుకోవచ్చు. ఇక ప్యాకెట్ పాలు కాకుండా నేరుగా గేదెల వ్యాపారుల నుంచి పాల‌ను కొనేవారు మాత్రం ఆ పాల‌ను ఖచ్చితంగా మ‌రిగించాలి. అప్పుడు మాత్రమే సాల్మొనెల్లా బ్యాక్టీరియా నశిస్తుంది. ఆ తర్వాత పాలను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

మాజీ మంత్రి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

తర్వాతి కథనం
Show comments