Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోకి ప్రవేశించిన ప్రమాదకర వైరస్ జికా?

ఆఫ్రికా దేశాలను భయభ్రాంతులకు గురిచేసిన ప్రాణాంతక జికా వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది. గుజరాత్‌లోని అహ్మదా బాద్‌ సిటీలోని బాపూనగర్‌ ప్రాంతంలో ముగ్గురికి జికా వైరస్‌ సోకిన విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(

Webdunia
ఆదివారం, 28 మే 2017 (11:54 IST)
ఆఫ్రికా దేశాలను భయభ్రాంతులకు గురిచేసిన ప్రాణాంతక జికా వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది. గుజరాత్‌లోని అహ్మదా బాద్‌ సిటీలోని బాపూనగర్‌ ప్రాంతంలో ముగ్గురికి జికా వైరస్‌ సోకిన విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) శనివారం నిర్ధారించింది. వైరస్‌ బారినపడిన వారిలో గర్భిణి, 64 ఏళ్ల వృద్ధుడు, బాలింత ఉన్నారు. వీరంతా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం. 
 
సాధారణ నిర్ధారణ పరీక్షలో భాగంగా అహ్మదాబా‌ద్‌లోని బీజే వైద్యకళాశాల ఆధ్వర్యంలో 93 రక్తనమూనాలపై ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్ట్‌ జరపగా వైరస్‌ ఉన్న సంగతి వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన శాంపిళ్లపై మళ్లీ నిర్ధారణ కోసం పుణెలోని ల్యాబ్‌లో టెస్టులు చేశారు. 
 
నిర్ధారణ పరీక్షల వివరాలను డబ్ల్యూహెచ్‌వోకు పంపించామని, వైరస్‌ జాడను నిర్ధా రిస్తూ అక్కడి నుంచి సమాచారం వచ్చిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో భారత్‌లోకి జికా వైరస్ ప్రవేశించినట్టు వైద్యులు నిర్ధారించారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బండ్లగూడలో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం...

Andhra Pradesh liquor scam: అదనపు ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

Telangana: తెలంగాణలో కుమ్మేసిన వర్షాలు.. రాత్రిపూట భారీ వర్షపాతం- కూలిన భవనాలు (video)

అసీం మునీర్‌ మరో బిన్ లాడెన్ : పెంటగాన్ మాజీ అధికారి రూబిన్

విడాకుల పత్రాలను సమర్పించి ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీ స్కామ్ బట్టబయలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

తర్వాతి కథనం
Show comments