ఇకపై ఏసీల్లో 24 లేదా 26 డిగ్రీల టెంపరేచర్ మాత్రమే...

దేశంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో డిమాండ్ కూడా నానాటికీ పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ను ఆదా చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై ఏసీలో కేవలం 24 లేదా 25 డిగ్రీల

Webdunia
ఆదివారం, 24 జూన్ 2018 (11:39 IST)
దేశంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో డిమాండ్ కూడా నానాటికీ పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ను ఆదా చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై ఏసీలో కేవలం 24 లేదా 25 డిగ్రీల టెంపరేచర్‌ మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోనుంది.
 
ఇలా చేయడం వల్ల విద్యుత్ బిల్లులపై భారం తగ్గడంతో పాటు వినియోగదారుల ఆరోగ్యం బాగుంటుందని ప్రజల్లో అవగాహన పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇదేసమయంలో అన్ని వాణిజ్య, ప్రభుత్వ రంగ సంస్థలూ తమ కార్యాలయాల్లో 24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా ఏసీలను మార్చుకోవాలని విద్యుత్ శాఖ నోటీసులను పంపింది. 
 
ముఖ్యంగా, ప్రజల్లో ఆరు నెలల పాటు అవగాహన కల్పించనుంది. ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను గమనించి, 24 డిగ్రీల డిఫాల్ట్ సెట్టింగ్‌ను తప్పనిసరి చేయాలని భావిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ విషయమై ఏసీ తయారీదారుల కంపెనీలతో చర్చించామని అధికారులు తెలిపారు. 
 
సాధారణంగా మానవ శరీరం 35 నుంచి 37 డిగ్రీల సెల్సీయస్‌లో ఉంటుంది కాబట్టి 24 డిగ్రీల చల్లదనం హాయిగా ఉంటుందని తెలిపిన విద్యుత్ మంత్రి ఆర్కే.సింగ్ చెపుతున్నారు. కానీ, చాలా హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య భవనాల్లో 18 నుంచి 21 డిగ్రీల టెంపరేచర్‌ను కొనసాగిస్తున్నారని అన్నారు. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరగడంతో పాటు.. విద్యుత్ బిల్లుల భారం పెరుగుతుందని చెపుతున్నారు.

అంతేకాకుండా, వినియోగదారుల ఆరోగ్యం కూడా బాగుటుందనీ, ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నం కావని చెబుతున్నారు. 24  లేదా 26 డిగ్రీల టెంపరేచర్‌ను పెట్టుకోవడం వల్ల అనారోగ్యంతో బాధపడేవారు కూడా ఏసీ గదుల్లో హాయిగా నిద్రపోవచ్చని చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Live Jubilee Hills Bypoll Results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో కాంగ్రెస్

Sangareddy: అన్నం పాత్రలో కాలు పెట్టి హాయిగా నిద్రపోయిన వాచ్‌మెన్

బీహార్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు : ఆధిక్యంలో ఎన్డీయే కూటమి

Cold Wave: తెలంగాణలో చలిగాలులు.. శని, ఆదివారాల్లో పడిపోనున్న ఉష్ణోగ్రతలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

తర్వాతి కథనం
Show comments