Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరుగుతున్న మూర్ఛరోగులు : డాక్టర్ దినేష్ నాయక్

దేశంలో మూర్ఛరోగుల సంఖ్య పెరుగుతోందని, దీనికి కారణంగా ఈ వ్యాధికి చికిత్స చేసేందుకు అధునాత వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ.. దానిపై అవగాహన లేకపోవడమేనని ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి న్యూరాలజీ, ఎపిలెప్సి విభాగ అధ

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (09:47 IST)
దేశంలో మూర్ఛరోగుల సంఖ్య పెరుగుతోందని, దీనికి కారణంగా ఈ వ్యాధికి చికిత్స చేసేందుకు అధునాత వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ.. దానిపై అవగాహన లేకపోవడమేనని ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి న్యూరాలజీ, ఎపిలెప్సి విభాగ అధిపతి డాక్టర్ దినేష్ నాయక్ అన్నారు. ఆ ఆస్పత్రిలో మూర్ఛరోగ సహాయక బృందం విభాగాన్ని తొలిసారి ఏర్పాటు చేసింది. ఈ విభాగం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచ ఆరోగ్యం సంస్థ నివేదిక మేరకు భారత్‌లో 12 మిలియన్‌ల మంది మూర్ఛరోగ నిపుణులు ఉన్నారని చెప్పారు. ఇది ప్రపంచంలో ఐదో వంతు అని వెల్లడించారు.
 
వాస్తవంగా మూర్ఛ రోగానికి తగిన చికిత్స ఉందన్నారు. కానీ, దీనిపై చాలా మంది సరైన అవగాహన లేదన్నారు. దేశంలో ఉన్న మూర్ఛరోగుల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్న రోగుల్లో సగటున 60 శాతం మంది మాత్రమే చికిత్స తీసుకుంటున్నారని ఆయన వివరించారు. దీనికి ప్రధాన కారణం సరైన అవగాహన లేకపోవడమేనని ఆయన గుర్తు చేశారు.
 
ఇకపోతే.. ఫోర్టిస్ మలర్ ఆస్పత్రిలో ప్రారంభించిన మూర్ఛరోగ సహాయక బృందంపై ఆయన స్పందిస్తూ... ఈ బృందం ఆస్పత్రిలో చికిత్స పొందే, చికిత్స కోసం వచ్చే మూర్ఛరోగులతో పాటు.. వారి కుటుంబ సభ్యుల్లో సరైన అవగాహన కల్పించడమే ప్రధాన విధి అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎపిలెప్సి విభాగానికి చెందిన పలువురు మాజీ ప్రొఫెసర్లు, వైద్యులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments