Webdunia - Bharat's app for daily news and videos

Install App

షుగర్ వ్యాధితో బాధపడుతుంటే..? ఐతే వారానికి నాలుగు రోజులు....

షుగర్ వ్యాధిని తగ్గించుకునే సరికొత్త మార్గం వచ్చింది. దీనికోసం డాక్టర్ల దగ్గరకు పరుగులు తీయక్కర్లేదు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మందులు వాడాల్సిన పని అంతకన్నా లేదు. వారానికి నాలుగు గుడ్లు తింటే చాలు మధుమేహం మన మాట వింటుందంటున్నారు పరిశోధకులు.

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2016 (21:16 IST)
షుగర్ వ్యాధిని తగ్గించుకునే సరికొత్త మార్గం వచ్చింది. దీనికోసం డాక్టర్ల దగ్గరకు పరుగులు తీయక్కర్లేదు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మందులు వాడాల్సిన పని అంతకన్నా లేదు. వారానికి నాలుగు గుడ్లు తింటే చాలు మధుమేహం మన మాట వింటుందంటున్నారు పరిశోధకులు. 
 
6 కోట్ల 50 లక్షలు ఇది ఓ రాష్ట్రం జనాభా కాదు, దేశంలో డయాబెటిస్ రోగుల సంఖ్య. మధుమేహం ఒకప్పుడు పెద్దల్లోనే ఎక్కువగా కనిపించే ఈ సమస్య, ఇప్పుడు పిల్లల్నీ పట్టి పీడిస్తోంది. డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మారుతున్న ఆహారపు అలవాట్లు జనాన్ని డయాబెటిస్ బారిన పడేలా చేస్తున్నాయి. డయాబెటిస్ చికిత్స తీసుకోవడంతో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, కొన్ని రకాల యోగాసనాలు వేయడం వల్ల మధుమేహ నియంత్రణ సాధ్యమవుతుందంటున్నారు డాక్టర్లు.
 
డయాబెటిస్ రెండు రకాలు అవి టైప్ వన్, టైప్ టు. ప్రపంచంలో 95 శాతం మంది టైప్ టు డయాబెటిస్‌‍తోనే బాధపడుతున్నారు. వీరి శరీరానికి సరిపడినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్లో లేదంటే అధికంగా ఉత్పత్తి కావడం వల్లో ఈ టైప్ టు డయాబెటిస్ సోకుతుంది. దీనివల్ల గ్లూకోజ్ రక్తం నుంచి శరీరంలోని కణాలకు అందదు. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోతుంది.
 
మధుమేహం నియంత్రణకు మహామంత్రం. వారానికి నాలుగు గుడ్లు తింటే చాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రియన్‌లో ప్రచురితమైన ఓ పరిశోధన. వారానికి నాలుగు గుడ్లు తింటే మధుమేహ నియంత్రణ సాధ్యమే అంటోంది. గుడ్లలో కొలస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారానికి నాలుగుకంటే ఎక్కువ గుడ్లు తినకూడదన్న అభిప్రాయం గతంలో ఉండేది. కానీ, అందులో ఉన్న కొవ్వు మన శరీరానికి మంచిదే అంటున్నారు పరిశోధకులు. 
 
ముఖ్యంగా టైప్ టు మధుమేహంతో బాధపడేవారు గుడ్డును తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ సమతుల్యంగా ఉంటుందని గుర్తించారు. ఈస్ట్రన్ ఫిన్‌లాండ్ యూనివర్సిటీలో 2332 మందిపై 19 ఏళ్ల పాటు ఈ పరిశోధన సాగింది. వారానికి ఒక గుడ్డు తిన్న వారికంటే నాలుగు గుడ్లు తిన్నవారిలో 37 శాతం మందికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు ఈ రీసెర్చ్‌లో తేలింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

తర్వాతి కథనం
Show comments