Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూల్‌డ్రింక్స్ కావు.. కిల్ డ్రింక్స్ : బాదంపాలు కూడా కల్తీనే...

మార్కెట్‌లో లభించే కూల్‌డ్రింక్స్‌పై ఆసక్తికర విషయం ఒకటి వెలుగు చూసింది. ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న శీతలపానీయాల్లో ఎక్కువ శాతం నకిలేవనట. వీటిని తాగడం వల్ల అనారోగ్యం పాలుకావడం తథ్యమని తాజా పరిశోధ

Webdunia
సోమవారం, 26 జూన్ 2017 (10:22 IST)
మార్కెట్‌లో లభించే కూల్‌డ్రింక్స్‌పై ఆసక్తికర విషయం ఒకటి వెలుగు చూసింది. ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న శీతలపానీయాల్లో ఎక్కువ శాతం నకిలేవనట. వీటిని తాగడం వల్ల అనారోగ్యం పాలుకావడం తథ్యమని తాజా పరిశోధన ఒకటి వెల్లడైంది. ముఖ్యంగా శీతల పానీయాలు ఎక్కువగా తాగితే ప్రాణాంతక రోగాలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కల్తీరాయుళ్లు బ్రాండెడ్‌ సీసాల్లో రసాయనాలతో తయారు చేసిన పానీయాలు నింపి అమ్మేస్తున్నట్టు తేలింది. 
 
కొన్ని కంపెనీలు తయారు చేసే కొన్ని కూల్‌డ్రింక్స్‌లో 0.05 శాతం ఆల్కహాల్‌ ఉంటుంది. దీంతో మనిషి శరీరానికి పెద్దగా నష్టం ఉండదు. కానీ నకిలీ బ్రాండ్లలో ఆల్కహాల్‌ను ఎక్కువ శాతం వినియోగిస్తున్నట్టు తేలింది. మద్యంతో కూడిన కూల్‌డ్రింక్స్‌ మరింత ప్రమాదకరం. ఇవి తాగితే 15 రకాల కేన్సర్లు వచ్చే అవకాశం ఉంది. మరికొంత మంది కల్తీరాయుళ్లు శీతల పానీయాల్లో తీపికోసం పలు రసాయనాలు కలుపుతున్నారు. ఇటువంటి పానీయాలను నెల రోజులు వరుసగా తాగితే టైప్‌ 2 మధుమేహం రావడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే, కిడ్నీ, గ్యాస్ట్రిక్ సమస్యలూ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మహిళల్లో అయితే గర్భకోశ సమస్యలు వస్తాయని గైనకాలజిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు.
 
కేవలం కూల్‌డ్రింక్స్‌లోనే కాదు.. బాదం పాలలోనూ కల్తీ జరుగుతున్నట్టు తేలింది. సాధారణంగా పాలు, బాదంపొడి, చక్కెర కలిపి బాదంపాలను తయారు చేస్తారు. కల్తీరాయుళ్లు తాము తయారు చేసే బాదంపాలకు రుచి, రంగు కోసం ఇథనాల్‌ కలిపి సీసాల్లో నింపి అమ్మేస్తున్నారు. తాగే వారికి అనుమానం రాకుండా చక్కెర శాతం ఎక్కువగా కలిపేస్తున్నారు. ఈ బాదం పాలు తాగడం వల్ల జీర్ణకోశ, మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments