Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాఢనిద్రలోంచి మెలకువ వచ్చినా లేవలేరు.. కదల్లేరు.. గువ్వతొక్కిందా.. దయ్యం నొక్కుతోందా? ఏది నిజం?

మీరు గాఢ నిద్రలో ఉంటారు. ఉన్నట్లుండి పీడకల వచ్చింది. మీరు ఆమాంతం లోయలోకి పడిపోతున్నట్లు, కొండ కింది నుంచి జారి వేగంగా కిందికి పడిపోతున్నట్లు, లోతైన బావిలో జారి పడుతున్నట్లు కల కంటుండగానే ఉన్నట్లుండి మెలకువ వస్తుంది. మెలకువ వచ్చినా మీ శరీరం స్పృహలో ఉం

Webdunia
శుక్రవారం, 26 మే 2017 (07:25 IST)
మీరు గాఢ నిద్రలో ఉంటారు. ఉన్నట్లుండి పీడకల వచ్చింది. మీరు ఆమాంతం లోయలోకి పడిపోతున్నట్లు, కొండ కింది నుంచి జారి వేగంగా కిందికి పడిపోతున్నట్లు, లోతైన బావిలో జారి పడుతున్నట్లు కల కంటుండగానే ఉన్నట్లుండి మెలకువ వస్తుంది. మెలకువ వచ్చినా మీ శరీరం స్పృహలో ఉండదు. గొంతు చించుకుని గట్టిగా అరిచానని అనుకుంటారు. కాని అరుపు గొంతులోనే ఉంటుంది కాని బయటకు రాదు. నవరంధ్రాలు స్తంభించిపోయినట్లు, నరాలు ఎక్కడి కక్కడ పట్టేసినట్లు మీరు కదల్లేరు మెదల్లేరు. కానీ మెలకువ అయితే ఉంటుంది. ఇలాంటి స్థితి గ్రామీణ ప్రాంతాల్లో అనేకమందికి కలిగే ఉంటుంది.
 
20 లేదా 30 ఏళ్ల క్రితం అయితే ఇలా మెలకువతో ఉన్నప్పటికీ శరీరాన్ని చివరకు కాళ్లు, చేతులను కూడా కదలించకుండా పోయే స్థితిని ఇళ్లలో పెద్దలు గ్రహం పూనిందని, అతీత శక్తి ఏదో వచ్చి మీద కూర్చుని మిమ్మల్ని గట్టిగా పట్టి ఉంచిందని చెప్పేవారు. మరికొందరయితే గువ్వ తొక్కింది అనేవారు. మిత్తి వచ్చి వాలింది అనేవారు. మిత్తి అంటే మృత్యువు అని అర్థం. వీటిలో గువ్వ తొక్కింది అనే పదం విచిత్రమైనది. మగ పక్షి ఏదైనా తన జంటపక్షితో సంభోగించినప్పుడు ఆడపక్షిపైన కూర్చుని తన కాలి రెక్కలతో గట్టిగా నేలకేసి అదిమి దాన్ని ఎటూ కదలకుండా తొక్కి పట్టి ఉంచుతుంది కదా. అలాగా మృత్యువు నీ మీద వాలి నిన్ను కదలకుండా ఉంచుతుందని, అలాంటప్పుడు కొన్ని క్షణాలు మీరు మతిలో ఉన్నా ఏరకంగానూ కదల్లేరని పెద్దలు చెప్పేవారు. కొన్ని రకాల దెయ్యాలు అలా అదృశ్యంగా మనిషిపై వాలి గువ్వ తొక్కి ఉంచినట్లు శరీరాన్ని గట్టిగా తొక్కి ఉంచుతాయని చెబుతుంటారు
 
ఒక్కసారి అలా కదల్లేని పరిస్థితి నుంచు బయటపడ్డాక ఆ షాక్ ఎంత ప్రభావం వేస్తుందంటే జీవితంలో అలాంటి స్థితి మళ్లీ రాకూడదనుకుంటారు. అలాగే.. నిద్రపోయినప్పుడు పిలిస్తే కొంతమంది ఇట్టే లేస్తారు. ఒక్కసారి ముట్టుకుంటే చాలు ఉలిక్కిపడి లేచి కూర్చుంటారు. కానీ అతి తక్కువ శాతం మంది మాత్రం ఎంత పిలిచినా ఉలకరు పలకరు. మెలకువ వచ్చినా లేవలేరు కూడా. దీనినే ఆధునిక వైద్యం స్లీప్ పెరాలసిస్ అని చెబుతోంది. పెరాలసిస్ వ్యాధిగ్రస్థులు మంచం మీద నుంచి లేవలేరని తెలుసు కదా.. స్లీప్ పెరాలసిస్ (Sleep Paralysis) లక్షణాలు ఉన్నా అంతే! నిద్రలో నుంచి మెలకువ వచ్చినా సరే.. లేచి కూర్చోలేకపోవడాన్నే స్లీప్ పెరాలసిస్ అంటారు. 
 
మగత నిద్రలో ఉండి, కాళ్లు, చేతులు పట్టేసినట్లు ఉండి శరీరం మొత్తం అచేతన స్థితిలోకి వెళ్లిపోతుంది. అయితే కొద్దిసేపటికి దానికదే మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది కూడా. ఇలాంటి నిద్ర రోగం వల్ల నష్టం ఏమీ లేకున్నా, అత్యవసర పరిస్థితుల్లో మాత్రం కొంచెం కష్టమేనని డాక్టర్లు చెబుతున్నారు. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి లక్షణాలను ‘దయ్యం మనిషిని లేవకుండా కిందకు నెట్టేస్తోంది’ అని భావిస్తుంటారు. మెక్సికోలో అయితే, ‘మరణమే మనిషిపై కూర్చుని ఉంది’ అని చెప్పుకుంటుంటారు. అక్కడి ఆచారాల ప్రకారం పూజలు పునస్కారాలు కూడా చేస్తుంటారు.
 
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎస్వీ యూనివర్సిటీ మెస్‌.. భోజనంలో జెర్రీ కనిపించింది.. విద్యార్థులు షాక్

చిరుధాన్యాల పునరుద్ధరణ, పత్తి పునరుద్ధరణ: ఢిల్లీ కళా ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాల నుండి సస్టైనబిలిటీ ఛాంపియన్లు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియకు బ్రేక్.. ఎందుకంటే?

Delhi Elections: పన్ను మినహాయింపే కలిసొచ్చిందా..? బీజేపీపై విజయంపై పవన్ ప్రశంసలు

కిరణ్ రాయల్ చేసిన మోసంతో చనిపోతున్నా: సెల్ఫీ వీడియోలో మహిళ సంచలన ఆరోపణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

తర్వాతి కథనం
Show comments