Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరెందుకు లావవుతున్నారు... ఇవి తింటున్నారా...? అవి కాదు ఇవి తినండి....

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2015 (20:43 IST)
ఈమధ్య కాలంలో ఎక్కడ చూసినా బాగా లావుగా ఉన్న పిల్లలు, పెద్దలు కనబడుతున్నారు. కొంతమంది ఆయాసపడిపోతూ నడుస్తూ తమ శరీర బరువును తగ్గించుకునేందుకు అప్పుడప్పుడు వ్యాయామం చేసేందుకు రోడ్లపైకి వస్తుంటారు. ఇలా బరువు పెరిగిపోవడానికి కారణం వ్యాయామం లేకపోవడం ఒకటైతే... ఇష్టమొచ్చిన పదార్థాలను ఎలాబడితే అలా లాగించడం వల్ల. కాబట్టి అలాంటి పదార్థాలను వదిలేసి శరీర బరువును పెంచనటువంటి పదార్థాలకు ఆహారంలో చోటిస్తే శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
 
అన్ని గింజధాన్యాలు, ప్రాసెస్ చేయనటువంటి తృణధాన్యాలు సంపూర్ణ పోషకాహారాన్ని అందిస్తాయి. కాబట్టి రాగులు, మొక్కజొన్న, జొన్న, సజ్జ వంటి గింజధాన్యాలను వంటగదిలో చోటివ్వండి. వైట్ రైస్ తీసుకోవడానికి బదులుగా ఎరుపు, నలుపు లేదా గోధుమ పదార్థాలను తీసుకునేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా ఉదయం పూట అల్పాహారంగా వీటిని ఎంచుకుంటే చాలా మంచిది. వాటిని తీసుకోవడం ద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
 
పప్పుల్లో కూడా సోయా, శనగ వంటివాటిని తీసుకోవాలి. వీటిని రెండురోజులకోసారి భోజన పదార్థాల్లో భాగం చేస్తుండాలి. ఒకవేళ మాంసాహారంపైన మనసుపోతే కొవ్వు తక్కువగా ఉన్న మాంసాన్ని తీసుకోండి.  
 
రుతువులకు అనుగుణంగా వచ్చే పండ్లను తీసుకోవడం మరువద్దు. ఇలాంటి వాటిని రోజుకు రెండన్నా తీసుకుంటూ ఉండాలి. ఇవి ఫైబర్లను అందించడమే కాకుండా విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్‌ను శరీరానికి అందిస్తాయి. రోజుకు మన శరీరానికి 30 గ్రాముల వరకూ ఫైబర్ అవసరమవుతుంది. 
 
మనకు తెలిసితెలిసి తినే పదార్థాల నుంచే 15 శాతం కొవ్వు వచ్చి చేరుతుంది. కాబట్టి మాంసం, వెన్న, నెయ్యి, జున్ను, క్రీమ్ వంటి వాటిని తీసుకోవడం తగ్గించాలి. కొవ్వు తక్కువుగా ఉండే పాలు, పాల పదార్థాలను తీసుకోవాలి. ప్రత్యేకించి ఒకే నూనెను కాకుండా అన్ని నూనెలను మార్చిమార్చి వంటల్లో ఉపయోగిస్తుండాలి. కుకీలు, స్నాక్ ఫుడ్ ఐటెమ్స్ తీసుకోవడం తగ్గించేయాలి.
 
శరీరానికి అవసరమైన కేలరీల్లో కనీసం 10 శాతం కంటే తక్కువగా చక్కెరను మాత్రమే తీసుకోవాలి. ఉదాహరణకు ఓ సాధారణమైన బరువున్న స్త్రీకి ఒక రోజుకు 1900 కిలోకేలరీలు అవసరమవుతాయనుకుంటే ఆమె 10 టీ స్పూన్ల చక్కెరను తీసుకోవచ్చు. చక్కెర అంటే అదేదో టీ, కాఫీల్లోనే తీసుకుంటామని అనుకుంటాం... కానీ మనం రోజువారీ తీసుకునే పదార్థాల్లో చక్కెర నిల్వలు చాలానే ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. చెప్పాలంటే చక్కెర అత్యంత స్వల్పంగా వేసుకుని కాఫీ, టీ సేవనం చేస్తే మంచిది.
 
అన్నిటికంటే ముఖ్యమైనది... మూడుపూట్ల అన్నం తినేవారు కొందరు పని ఒత్తిడి అంటూ ఓ పూట భోంచేయడం మానేస్తారు. అలాంటి పని చేయనేకూడదు. మూడు పూటలా బ్యాలెన్స్ చేసుకుంటూ భోజనం తీసుకోవాలి. మీ భోజనం చేసే పళ్లెంలో పరిస్థితి ఎలా ఉండాలంటే... పళ్లెంలో అర్థం భాగం కూరగాయలు, 1/3 వ వంతు తృణధాన్యాలు, 1/3వ వంతు ప్రోటీన్లు, 150 మిల్లీ లీటర్ల పాలు లేదా పెరుగు తీసుకోవాలి. ఇలాంటిది ఆరోగ్యకరమైన భోజనం అనుకోవచ్చు. పిల్లలకు సీజన్లో వచ్చే పళ్లను స్నాక్స్‌గా ఇస్తే మంచిది. ఫ్రిజ్ లో కూల్ డ్రింకులు, ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్ పెట్టి వాటిని తాగడం మానేయడం మంచిది. 
 
భోజనం చేసేటపుడు చాలామంది చక్కగా టీవీ పెట్టుకుని చేస్తుంటారు. ఏడుపు సీన్లు వచ్చినప్పుడు ఉద్వేగం చెందుతూ, కామెడీ సీన్లకు నవ్వుకుంటూ, కోపంతో ఉండే సీన్లను చూసి ఆవేశంతోనూ ఇలా చేస్తుంటారు. ఇది తప్పు. భోజనం చేసేటపుడు టీవీని పెట్టవద్దు. దాన్ని ఉపయోగించకుండా భోజనాన్ని ముగించండి. ఇక వ్యాయామం విషయానికి వస్తే కనీసం 30 నుంచి 45 నిమిషాలు తప్పనిసరి. 40 ఏళ్ల లోపు వారి ప్రతిరోజూ గంటకు 5 కి.మీ వేగంతో నడవాలి. ఇక పిల్లల్ని ట్యూషన్లు, చదువు అని కట్టిపడేయకుండా వ్యాయామానికి కూడా చోటివ్వాలి. ఇలా చేస్తే అధిక బరువుతో అల్లాడిపోతూ వైద్యుడి చుట్టూ తిరగాల్సిన అవసరం రాదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మురళీ నాయక్‌కు పవన్, మంత్రుల నివాళి.. ఫ్యామిలీకి రూ.50 లక్షల ఆర్థిక సాయం (Video)

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తా : డోనాల్డ్ ట్రంప్

భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరిప్రదక్షిణ

ఛత్తీస్‌గడ్ టెన్త్ ఫలితాలు - టాప్ ర్యాంకర్‌కు బ్లడ్ కేన్సర్

ప్రజల నమ్మాకాన్ని మోడీ కోల్పోయారు.. యోగి ఆదిత్యనాథ్ ప్రధాని కావాలి.. నెటిజన్ల డిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

Show comments