Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోనును బాత్రూమ్‌లో ఉపయోగిస్తున్నారా?

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (22:08 IST)
స్మార్ట్ ఫోనును బాత్రూమ్‌లో ఉపయోగిస్తున్నారా? ఐతే మీ పని అయిపోయినట్టే. స్మార్ట్ ఫోన్ లేనిదే ప్రతి నిమిషం కూడా గడవని పరిస్థితి. ఎక్కడపడితే అక్కడ స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోతుంది. చివరకి టాయ్‌లెట్‌లో కూడా స్మార్ట్ ఫోన్లను వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలా బాత్రూమ్‌ల్లో స్మార్ట్ ఫోన్లు వాడి వారికి పైల్స్ వ్యాధి తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొబైల్‌ను టాయిలెట్‌కు తీసుకెళ్లడం వల్ల కలిగే సమస్యల గురించి చూస్తే… టాయిలెట్‌కు వెళ్ళినప్పుడు ఫోన్‌ని తీసుకెళ్లడం వల్ల పైల్స్‌కి దారి తీస్తుంది.
 
యువతలో కూడా ఇది ఇప్పుడు వస్తోంది. మొబైల్ వల్ల పైల్స్ ఎందుకు వస్తుంది అనే విషయానికి వస్తే… ఫోన్‌ని వాడడం వల్ల సాధారణ సమయం కన్నా అధిక సమయం టాయిలెట్‌లోనే కూర్చుంటారు. దీని మూలంగా అది మారుతుంది. టాయ్‌లెట్‌‌లో స్మార్ట్ ఫోన్లను వాడటం ద్వారా కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. టాయిలెట్‌లో కూర్చుని పేపర్ చదివిన, మొబైల్‌‌ని ఉపయోగించిన సమస్య ఏమీ తెలీదు.
 
ఇలా ఎక్కువ సేపు టాయ్‌లెట్‌లో కూర్చుని ఉంటే పాయువు మరియు పురీషనాళం కండరాల నరాల పై ఒత్తిడి పడుతుంది. ఇది పైల్స్ సమస్యకు ఓ కారణం అవుతుంది. అలానే టాయిలెట్‌కు ఫోన్‌ తీసుకెళ్లడం ద్వారా దానికి బ్యాక్టీరియా అంటుకుంటుంది.
 
చేతులు శుభ్రం చేసుకున్న మొబైల్‌ని కడగడం కుదరదు కనుక మొబైల్‌కి అంటుకున్న బ్యాక్టీరియా మిమ్మల్ని ఇన్ఫెక్షన్ల బారిన పడేలా చేస్తుంది. కాబట్టి మొబైల్‌ని బాత్రూమ్‌లో ఉపయోగించకుండా ఉంటేనే మేలు. లేదంటే ఎన్నో సమస్యలు బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

తర్వాతి కథనం
Show comments