Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగకుండా బరువు ఎందుకు పెరుగుతారు?

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (23:22 IST)
మనిషి దేహం 21 సంవత్సరాల వరకు పెరుగుతూ ఉంటుంది. దేహం పెరిగే వరకు బరువు పెరగవచ్చు, కాబట్టి బరువు కూడా పెరుగుతూ ఉంటుంది. 21 సంవత్సరాల తర్వాత పొడవు పెరగడం ఆగిపోయింది. కాబట్టి, దేహ బరువు కూడా ఆగి పోవాలి. కానీ మనిషి తిండి మీద ఉన్న కోరిక వలన తిని, తిని బరువు మాత్రం ఆగకుండా వయస్సుతో పాటు పెంచుకుంటూ ఉన్నాడు. ఇదే అన్ని రకాల మానసిక, శారీరక దుఃఖాలకు కారణం.

 
మనిషి బరువు ఎప్పుడు కూడా వయస్సును బట్టి పెరగరాదు. పొడవును బట్టే పెరగాలి. వయస్సుతో పాటు పెరగాలి అని  చెప్పండం అజ్ఞానం. 21 సంవత్సరాల తర్వాత శరీరం పొడవు పెరగదు. కాబట్టి ఆ వయస్సులో ఉన్న బరువే వంద సంవత్సరాలైనా ఉండాలి. దానికి మించి ఒక్క కిలో కూడా పెరగరాదు.


కారణం ఏంటంటే? 21 సంవత్సరాలలో ఒక వ్యక్తి బరువు 50 కిలోలు ఉంటే, అతని దేహం లోపలి అవయవాలు ఊపిరితిత్తులు, గుండె, కాలేయం, ప్యాంక్రియాస్, మూత్రపిండాలు, పొట్ట, ప్రేగులు, మోకాళ్ళు, వెన్నెముక మొదలగునవి కూడా ఆ 50 కిలోల దేహానికి ఎంత పనిచేసే సామర్ధ్యం ఉండాలో, అంత సామర్థ్యం కలిగిన పై అవయవాలను మాత్రమే భగవంతుడు మనకు ఇచ్చి ఉంటాడు.
 
మనం మనస్సును అదుపు చేయలేక తిని, తిని ఉండవలసిన 50 కిలోల బరువు కన్నా అధికంగా 30 కిలోల బరువును 80 కిలోల వరకు పెంచుకున్నామనుకోండి. 50 కిలోల దేహానికి హాయిగా, సుఖంగా పని చేయగల శక్తి కలిగిన పై అవయవాలు అధికంగా ఉన్న దేహానికి పని చేయలేక త్వరగా పాడైపోతాయి. అందువలననే ఈ రోజులలో కిడ్నీస్ ఫెయిల్యూర్సు, హార్ట్ ఫెయిల్యూర్స్, లంగ్స్ ఫెయిల్యూర్, వెన్నెముక సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, బిపిలు, షుగర్స్ మొదలగునవి రావడానికి  కారణం.

 
50 కిలోలకు అందవలసిన శక్తి 80 కిలోల దేహానికి అందడం వలన, మనస్సుకు అవసరమైన శక్తి చాలకుండా కోపం, కోరికలు, ఇతర ఆవేశాలు పెరిగి, అనేక మానసిక సమస్యలకు కూడా కారణం. కనుక వెంటనే బరువు పెరగడం ఆపాలి. పెరిగిన బరువును తగ్గించుకోవాలి.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments