Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగి తినకపోతే..?

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (11:36 IST)
పండ్లను మార్కెట్ నుంచి తెచ్చుకుని.. పొడిదుస్తులతో తుడిచేసి కట్ చేసి లాగించేస్తున్నారా? అయితే ఇక జాగ్రత్తపడండి. యాపిల్స్‌, ద్రాక్ష, చెర్రీస్‌, టమాటా, దోసకాయ, మామిడి, స్ట్రాబెర్రీ, అరటి పండు ఇలా పలు రకాల పండ్లు, కూరగాయలకు రంగు వచ్చేందుకు, పండేందుకు రసాయనాలు వాడుతున్నారు. వాటిని తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, క్యాన్సర్‌ వంటి రోగాలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇలా శుభ్రం చేయని పండ్లను తీసుకోవడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. పండ్లు, కూరగాయలు ఇంటికి తెచ్చినప్పుడు గోరువెచ్చని నీటిలో కొద్ది సేపు నానబెట్టిన తరువాత గుడ్డతో తుడిచేసిన తరువాత వాటిని తినాలి. ఏ కాలంలో దొరికే పండ్లను అప్పుడే తినాలి. 
 
యాపిల్‌లో ఎక్కువగా మెరుపు కన్పిస్తే మైనపు పూత ఉన్నట్లే. గోటితో పండుపై గీకితే అంటుకుంటుంది. ఒకవేళ ఇంటికి తెచ్చినట్లైతే చాకుతో పైన చెక్కినా చాలు. అనుమానం ఉంటే పండుపై వేడి నీళ్లు పోస్తే తెలిసిపోతుంది. మైనపు పూత పోవాలంటే పండును బాగా కడగాలి. చాకుతో తొక్కను మొత్తం తీసి వేసి అప్పుడే తినాలి. లేదంటే జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులకు మరింత ప్రమాదకరం. బాగా పండినవి, తొడిమ తొలగకుండా ఉన్న అరటి పండ్లను మాత్రమే కొనుగోలు చేయాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మృగశిర కార్తె: కస్టమర్లతో నిండిపోయిన చేపల మార్కెట్లు.. భారీగా పలికిన ధరలు

కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు... ఇక జైలుకే పరిమితమా?

పిఠాపురం నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్

ముంబైలో ఘోరం.. రైలు నుంచి జారిపడి 12 మంది మృతి

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

తర్వాతి కథనం
Show comments