Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీళ్లు కొవ్వును కరిగిస్తాయా?

అవును.. నీటికి కొవ్వును కరిగించే శక్తి వుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నీరు శరీరంలో క్లెన్సర్‌గా పనిచేస్తుంది. సాధారణ నీటి కంటే గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవ

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (12:02 IST)
అవును.. నీటికి కొవ్వును కరిగించే శక్తి వుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నీరు శరీరంలో క్లెన్సర్‌గా పనిచేస్తుంది. సాధారణ నీటి కంటే గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. అందుకే రోజుకు కనీసం రెండుసార్లైనా రెండు గ్లాసుల వేడినీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి హానిచేసే కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవాలంటే.. రోజుకు నాలుగైదు సార్లు వేడి నీటిని తాగడం ద్వారా బరువు కూడా తగ్గుతుందని వారు చెప్తున్నారు. 
 
ఇందులో భాగంగా ప్రతిరోజూ లేవగానే కనీసం నాలుగు గ్లాసుల నీళ్లు తాగాలి. అయితే ఒకేసారి నాలుగు గ్లాసులు ఒకేసారి కష్టం అనుకునేవారు.. తొలుత గ్లాసుతో ప్రారంభించి నెమ్మదిగా పెంచుకుంటూ పోవాలి. రోజూ మొత్తంలో పది నుంచి 12 గ్లాసుల నీటిని తాగడం ద్వారా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. హైబీపీ దరిచేరదు. కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.
 
అలాగే తీసుకునే ఆహారంలో కొవ్వు అధికశాతం లేకుండా చూసుకుంటే బరువు తగ్గుతారు. మైదా, పంచదార, ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న చిరుతిళ్లను మానేయాలి. నూనెలో వేయించిన పదార్థాలను తగ్గించాలి. గోధుమలతో చేసిన బ్రెడ్‌ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసుకోవచ్చు. ఆహార పదార్థాల్లో ఉప్పు మోతాదును తగ్గించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.
 
అలాగే తీసుకునే ఆహారంతో పాటు పండ్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. మీగడ పాలతో చేసిన పెరుగును ఎంచుకోవడం మంచిది. బరువు తగ్గాలనుకునే వారు మొదటగా స్వీట్లను తినడం మానేయాలి. నూనెను బాగా తగ్గించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments